ఆ కాలనీల్లో ఉంటేనే...
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తుకు ఉద్దేశించిన పథకం ‘జగ్జీవన్ జ్యోతి’. ఈ పథకం ద్వారా 200 యూనిట్ల లోపు వినియోగం వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చేలా 2019 జులై 24న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం నిబంధనల్లో
జగ్జీవన్ జ్యోతి పథకం నిబంధనల్లో మార్పు
71,137 మంది ఎస్సీ, ఎస్టీలు ఉచిత విద్యుత్తుకు దూరం
తెనాలి టౌన్, న్యూస్టుడే
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తుకు ఉద్దేశించిన పథకం ‘జగ్జీవన్ జ్యోతి’. ఈ పథకం ద్వారా 200 యూనిట్ల లోపు వినియోగం వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చేలా 2019 జులై 24న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. వాటి అమలు గత నెల నుంచి మొదలైంది. ఫలితంగా పలువురు ఎస్సీ, ఎస్టీలు తిరిగి బిల్లు పరిధిలోకి రానున్నారు. వారిపై యథావిధిగా విద్యుత్తు భారం పడతుంది.
షరతులు వర్తిస్తాయ్...
* పథకం నుంచి ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించారు.
* ఒకే వ్యక్తి పేరిట ఒకటికి మించి మీటర్లు ఉంటే పథకం లబ్ధిని ఒక దానికే పరిమితం చేశారు.
* మూడో నిబంధన అత్యధికులను అనర్హులను చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో నివాసం ఉన్న వారు మాత్రమే పథకానికి అర్హులు. ఇతర కాలనీల్లో ఎస్సీ, ఎస్టీలు నివాసం ఉన్నా వారికి అర్హత లేదు. ఇది లబ్ధిదారుల్లో కోత వేస్తోంది. తాజా మార్పులతో గత నెలలో విద్యుత్తు బిల్లులకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య నుంచి అనర్హులను గుర్తించి, వారికి బిల్లులు చెల్లించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
పట్టణాల్లో ఎక్కువ...
మొత్తం మీద తాజా మార్పులతో 71 వేలకు పై చిలుకు కుటుంబాల లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధిని పొందే అర్హతను కోల్పోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాలనీల గుర్తింపునకు పెద్దగా ఇబ్బంది లేక పోయినా గుంటూరు నగరం, ఇతర పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల గుర్తింపు అధికారులకు సైతం కష్టంగా మారింది. ఎందుకంటె రెవెన్యూ విభాగం నోటిఫై చేసిన కాలనీలు కొన్ని మాత్రమే ఉండగా అధిక సంఖ్యలోని లబ్ధిదారులు ఇతర కాలనీల్లో కూడా ఉన్నారు. కాగా ఇంకా లోతైన విశ్లేషణ కొనసాగుతుంది.
జాబితాల పరిశీలన కొనసాగుతోంది
- బి.అశోక్కుమార్, విద్యుత్తు విభాగ డీఈ, తెనాలి
జగ్జీవన్ జ్యోతి పథకానికి సంబంధించి మారిన నిబంధనల మేరకు గతంలో ఉన్న లబ్ధిదారుల జాబితాల సమగ్ర విశ్లేషణ, పరిశీలన కొనసాగుతోంది. చాలా వరకు పథకం పరిధిలోకి రాని వారిని గుర్తించాం. అర్హత ఉండి పథకం నుంచి తీసివేస్తే సంబంధితులు సంప్రదించవచ్చు. క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
స్వతంత్ర అభ్యర్థిని.. కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి