వన సంరక్షణ మాట మరిచారు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు జలవనరుల సంరక్షణ, మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచి ప్రభుత్వ భూములు, కార్యాలయాలు,
మొక్కల పెంపకానికి దక్కని ఉపాధి సాయం
ఈనాడు, బాపట్ల
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు జలవనరుల సంరక్షణ, మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచి ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, రహదారుల వెంబడి, ఖాళీ స్థలాలు, బీడు భూముల్లో విరివిగా మొక్కలు నాటాలి. అదేవిధంగా పండ్ల మొక్కలను రైతులకు అందజేసి వాటిని పెంచేలా ప్రోత్సాహం అందించాలి. ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలు ఏర్పాటు చేసి అందులో మొక్కలు పెంచి వర్షాకాలంలో ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలి. దీనివల్ల కూలీలకు ఉపాధి కల్పనతో పాటు సామగ్రి విభాగం కింద వచ్చే నిధులను వినియోగించుకోవాలి. అయితే సామగ్రి విభాగం వాటా కింద వచ్చే నిధులను గ్రామసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్యకేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, రహదారుల నిర్మాణం తదితర పనులకు వినియోగించడంతో మొక్కల పెంపకానికి నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో మొక్కల పెంపకం, వనసంరక్షణ, జలసంరక్షణ పనులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పర్యావరణ పరిరక్షణ సంగతి మరిచినట్లయింది. గతంలో ఉపాధిహామీ పథకం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలు పెంచేవారు. పెంపకానికి అయ్యే ఖర్చు మొత్తం ఉపాధి హమీ పథకం నుంచి నిధులు వెచ్చించేవారు. అయితే నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో అటవీశాఖ మొక్కల పెంపకానికి ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది బాపట్లలో మాత్రమే ఉపాధి పథకంలో లక్ష మొక్కలు పెంచారు. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఒక్క మొక్క కూడా పెంచలేదు. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో అటవీశాఖ మొక్కలు ఇస్తే పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ఉపాధి హామీ పథకంలో మొక్కలు పెంచకపోవడం, కొనుగోలు చేయడానికి సామగ్రి విభాగం కింద నిధులు లభ్యత లేకపోవడంతో ఈ ఏడాది మొక్కలు నాటే కార్యక్రమం ఉండకపోవచ్చని అధికారి ఒకరు తెలిపారు. ఇదే మాదిరి పొలాల్లో రైతులు సేద్యపు కుంటల తవ్వకానికి మూడేళ్ల క్రితం భారీ ఎత్తున నిధులు అందించేవారు. అయితే ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. భూగర్భ జలాల సంరక్షణతో పాటు పైర్లకు అందుబాటులో నీళ్లు అందుబాటులో ఉండే ఈ పథకం గురించి పట్టించుకోకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.100 కోట్లకు పైగా బకాయిలు
గతంలో ఓ రైతు పొలంలో తవ్విన సేద్యపు కుంట
ఉమ్మడి గుంటూరు జిల్లాలో సామగ్రి విభాగం కింద చేసిన సిమెంట్ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం, ఉద్యానమొక్కల పెంపకం వంటి వాటికి రూ.100 కోట్లపైగా బకాయిలు ఉన్నాయి. ఉద్యానతోటల పెంపకం కింద రైతులు పండ్ల మొక్కలు కొనుగోలు చేసి పెంచితే మొక్కల కొనుగోలు, పెంచడానికి ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల చేస్తారు. రెండేళ్లుగా రైతులకు సొమ్ము చెల్లించడం లేదు. దీంతో ఈ ఏడాది రైతులు ఎవరూ పండ్ల తోటల పెంపకానికి ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సామగ్రి విభాగం వాటా కింద వచ్చే సొమ్మును ప్రాధాన్య క్రమంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని సూచించింది. దీంతో సామగ్రి విభాగం కింద ఇతర పనులకు నిధులు వెచ్చించలేని పరిస్థితి. పండ్ల తోటలు సాగు చేసిన రైతులకు చిలకలూరిపేట క్లస్టర్లో బకాయిలు చెల్లించినందుకు సంబంధిత యంత్రాంగంపై విచారణ చేసి బాధ్యులను చేయడంతో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులు సామగ్రి విభాగం కింద నిధుల విడుదలలో అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. కూలీలకు వేతనాల కింద 60 శాతం సొమ్ము వెచ్చిస్తుండగా, సామగ్రి వాటా కింద 40శాతం సొమ్ము సమకూరుతుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్దఎత్తున గ్రామాల్లో వివిధ ప్రభుత్వశాఖలకు భవనాలు నిర్మించడానికి ఉపాధి నిధులు వాడుకోవడంతో సామగ్రి విభాగం కింద లోటు కొనసాగుతోంది. ఇప్పట్లో లోటు భర్తీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈఏడాది మొక్కల పెంపకం లేనట్లేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి