మాతా, శిశు సంరక్షణ కేంద్రం కల సాకారం
సర్వజనాసుపత్రి(జీజీహెచ్)లో మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గత పది సంవత్సరాల కల సాకారం కానుంది.
నేడు పనులు పునః ప్రారంభం
ప్రతిపాదిత మాతాశిశు సంరక్షణ కేంద్రం భవనం
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: సర్వజనాసుపత్రి(జీజీహెచ్)లో మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గత పది సంవత్సరాల కల సాకారం కానుంది. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.86.80 కోట్లు ఇక్కడ చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు(జింకాన) భరించేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ గత జూన్ నెలలో ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ కేంద్రానికి కానూరి రామచంద్రరావు-జింకాన-మాతా శిశు సంరక్షణ కేంద్రంగా పేరు పెట్టాలని నిర్ణయించారు. పనులు పునఃప్రారంభించేందుకు బుధవారం పూజ కార్యక్రమం జింకాన ఆధ్వర్యంలో జరగనుంది. ఇప్పటికే గుత్తేదారు ఎంపికైనందున ఇక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
597 పడకలు
అందుబాటులో ఉన్న 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్తో పాటు జి+5 బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి 300 పడకలు, చిన్న పిల్లల విభాగానికి 200 పడకలు, పీఐసీయూ 27 పడకలు, ఎస్ఐసీయూ 30 పడకలు, ఎన్ఐసీయూ 40 పడకలు కేటాయించారు. బోధనానిపుణులకు 30 గదులు, ఒకేసారి 300 మంది వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరం ఏర్పాటు చేయనున్నారు. సర్వజనాసుపత్రిలో ప్రస్తుతం అని విభాగాల్లో 1,200 పడకలున్నాయి. అదనంగా మరో 597 పడకలు సమకూరనున్నాయి.
జింకాన కానుక
పునర్జన్మ వంటి ప్రసూతి వేదనను తట్టుకుని బిడ్డలకు జన్మనిచ్చే మాతృమూర్తులు పడుతున్న ఇబ్బందులను చూసి జింకాన సభ్యులు చలించిపోయారు. శస్త్రచికిత్సల ద్వారా కాన్పులు జరిగిన వారైతే పసికందులు సహా ఒకే పడక పైన ఇద్దరు ఇమడలేక పడే వేదన వర్ణనాతీతమని వారు అంతర్గతంగా చర్చించుకుని ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం రూ.35 కోట్లు, జింకాన రూ.30 కోట్లు భరించేవిధంగా 2019, ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారు రూ.6.27 కోట్ల నిర్మాణ పనులు చేసి నిలిపివేశారు. మూడేళ్లు దాటినా ఆ ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో జింకాన సభ్యులే ప్రాజెక్టు పనులు మొత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. అవసరమైన అనుమతులు వచ్చే విధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా కృషి చేశారు. ఇప్పటికే జింకాన పేరున రూ.30 కోట్లు ఉన్నాయి. ఇటీవల అమెరికాలోని డల్లాస్లో జింకాన సభ్యులు సమావేశమై సుమారు రూ.45 కోట్లు విరాళం ప్రకటించారు. ఇందులో గవని ఉమాదేవి తన భర్త కానూరి రామచంద్రరావు పేరున సుమారు రూ.22 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి రూ.100 కోట్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో మరో రూ.25 కోట్లు అవసరం కావడంతో స్థానికంగా ఉన్న వైద్యులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఎన్జీవోల నుంచి నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు జింకాన పూర్వ అధ్యక్షుడు రవికుమార్ త్రిపురనేని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అందరి సహకారం తీసుకుంటున్నామని వివరించారు. తమ విజ్ఞప్తి మేరకు 1994 బ్యాచ్కు చెందిన వైద్యులు రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఇప్పటికే ముందుకొచ్చినందున, వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు స్పందించాలని కోరుతున్నారు. వారిచ్చే విరాళాల ఆధారంగా సముచిత గౌరవంతో ఆ వార్డుకు వారి పేరు పెడతామంటున్నారు.
అన్నీ ఒకే భవనంలోనే
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మాతాశిశు సంరక్షణ భవనం నిర్మించనున్నారు. అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే భవనంలో సమకూర్చేవిధంగా ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ రంగంలో ఉన్న నిపుణుల సలహాలు తీసుకున్నారు. అమెరికాలోని పేరొందిన ఆసుత్రుల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి దీని నిర్మాణానికి తుది రూపం ఇచ్చారు. భవనం ఆకృతుల నుంచి ప్రతి వార్డులోనూ మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నిర్మించేలా కార్యాచరణ రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక