Super Star Krishna: నీ జ్ఞాపకాల నీడలో..
బుర్రిపాలెం బుల్లోడు.. తన తేనె లాంటి మనసుతో అందరికీ అభిమానవంతుడయ్యాడు. సాహసమే ఊపిరిగా చిత్రసీమలో అడుగుపెట్టి అసాధ్యుడు అనిపించుకున్నాడు. డేరింగ్ డాషింగ్ నిర్ణయాలతో సినిమా పరిశ్రమలో అఖండుడయ్యాడు. అపజయాలు ఎదురైనా అధిగమించి నెంబర్వన్గా నిలిచాడు. నిర్మాతల పాలిట దేవుడు లాంటి మనిషిగా మారాడు. ప్రయోగాలకు ముందడుగు వేసి హీరో అయ్యాడు.
దిగంతాలకు బుర్రిపాలెం బుల్లోడు
కృష్ణతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నజిల్లావాసులు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - తెనాలి, పర్చూరు, అద్దంకి
బుర్రిపాలెం బుల్లోడు.. తన తేనె లాంటి మనసుతో అందరికీ అభిమానవంతుడయ్యాడు. సాహసమే ఊపిరిగా చిత్రసీమలో అడుగుపెట్టి అసాధ్యుడు అనిపించుకున్నాడు. డేరింగ్ డాషింగ్ నిర్ణయాలతో సినిమా పరిశ్రమలో అఖండుడయ్యాడు. అపజయాలు ఎదురైనా అధిగమించి నెంబర్వన్గా నిలిచాడు. నిర్మాతల పాలిట దేవుడు లాంటి మనిషిగా మారాడు. ప్రయోగాలకు ముందడుగు వేసి హీరో అయ్యాడు. తన ప్రవర్తనతో అందరి మనసుల్లో అభిమాన సింహాసనంపై కూర్చున్నాడు. అందుకే ఈనాడు ఆయన లేరంటే అభిమానులతో పాటు అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మా మంచి కృష్ణ అంటూ ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.
కారంచేడులో ‘సావాసగాళ్లు’ చిత్రం షూటింగ్ సందర్భంగా నాటి నిర్మాత రామానాయుడుతో కృష్ణ
బుర్రిపాలెం బుల్లోడిగా అభిమానుల మనసు దోచుకున్నారు. సూపర్స్టార్తో సినీజగత్తులో కీర్తికిరీటాలను అందుకున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించి జిల్లాకు ఎంతో వన్నె తెచ్చారు. జన్మభూమిని మరవని మహనీయుడు. మెత్తని మనసు, విసుగెత్తని నటన, కొత్తదనం కోసం నిత్యాన్వేషణ తత్వం మొత్తం కలిసి నిండైన అందాల రూపం. ఏ పాత్ర పోషించినా ప్రేక్షకుడిని మెప్పించి సూపర్స్టార్ అనిపించుకున్న కృష్ణ కనుమరుగయ్యారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు ఆయన అభిమాన జనం. ఏ భేషజాలూ లేని బోళాతనం ఆయన సొంతం. పలకరించటానికి ఇంటికి వెళ్లినా, బయట ఏదైనా ఉత్సవాలకు అతిథిగా వచ్చినా అభిమానుల మీద కృష్ణ చూపే ప్రేమానురాగాలు అసమానం. ఈ ఆత్మీయతతోనే అందరి మనసులతో ఆయన పెనవేసుకుని ఉన్నారు. ఈ అనుబంధం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అభిమానులతో మరింత ఎక్కువని 2003 ఫిబ్రవరి 9న గుంటూరు దాసరి కల్చరల్ అకాడమీ రజతోత్సవాలకు అతిథిగా వచ్చినప్పుడు స్వయంగా చెప్పారు.
బుర్రిపాలెంలో కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న విద్యార్థులు
గుంటూరులో చిత్రీకరణతో ఘన విజయం: ఉవ్వెత్తున ఎగసిన ఆయన సినీ జీవితంలో కొంతకాలం స్తబ్ధత చోటు చేసుకుంది. అది పాడిపంటలు సినిమాతో చెదిరిపోయి మళ్లీ సూపర్ స్టార్ ఘన విజయం దక్కించుకున్నారు. ఈ చిత్రంలోని కొన్ని ఘట్టాలను గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో చిత్రీకరించారు. ఎడ్లపందేలు పోటీలను ఇక్కడి మైదానంలో చిత్రీకరించడంతో పెద్దఎత్తున జనం వచ్చారు. ప్రస్తుతం అరవై సంవత్సరాల వయసు సమీపంలో ఉన్న వారికి ఇంకా స్టేడియం మెట్ల మీద నుంచి కృష్ణ ఎడ్లబండి తోలుకెళ్లిన సన్నివేశాలు కళ్ల ముందు మెదలుతుంటాయి. అప్పట్లో రైతన్నలకు మరింత అభిమాన కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పాడిపంటలు సినిమా పెద్దపండగ సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని దక్కించుకుంది. వ్యవసాయ నేపథ్య కుటుంబాల్లోని వ్యక్తిగా పాత్రలు పోషించి ఆ నటనతో ప్రేక్షకుల హృదయాలలో కృష్ణ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయా పాత్రల చుట్టూ తిరిగిన కథ ఎక్కువగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో సంబంధం ఉండటం మరో విశేషం. ప్రస్తుత బాపట్ల జిల్లా కారంచేడులో సావాసగాళ్లు చిత్రీకరణ 1976లో 18 రోజుల పాటు జరగగా, కృష్ణ ఇక్కడే బస చేశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా 1985లో అద్దంకి ఎన్నికల ప్రచార సభలో కృష్ణ పాల్గొన్నారు.
అద్దంకి ఎన్నికల ప్రచార సభలో కృష్ణ ప్రసంగం
నరసరావుపేటలో కోడెల నుంచి జ్ఞాపిక అందుకుంటూ..
సినిమా వచ్చిందంటే పండగే
గుమ్మడి సీతారామయ్య, సెంట్రల్ జీఎస్టీ ఉద్యోగి, గుంటూరు
కృష్ణ అంటే ఎంతో అభిమానం. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ఆయన సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే. అప్పట్లో మద్రాసులోని ఆయన ఇంటికి తరచుగా వెళ్లేవాడిని. కృష్ణ మేనల్లుడు శ్రీనివాస్తో ఉన్న అనుబంధంతో ప్రతి ఏటా వెళ్లి ఫొటోలు దిగి వచ్చేవాళ్లం. కృష్ణకు సంబంధించి 250చిత్రాలకుపైగా ఫొటోలు సేకరించాను. కృష్ణ రాజకీయ జీవితానికి సంబంధించి అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ సేకరించాను. పాడిపంటలు సినిమా గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో చిత్రీకరించారు. ఈనాడు సినిమా టైటిల్ సాంగ్ నేడే ఈనాడే అనే పాటను నాజ్ సెంటర్లో చిత్రీకరించినప్పుడు జనాన్ని అదుపు చేయడం కష్టమైంది. కృష్ణ అనారోగ్యానికి గురైనప్పుడు కాకానితోటకు విజయనిర్మలతో కలసి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసి వెళ్లారు. అప్పుడు వారి వెంటే ఉన్నాను. పలు సినిమాల విజయోత్సవాలు గుంటూరులో అభిమానుల మధ్య జరిగాయి.
నరసరావుపేటతో ప్రత్యేక అనుబంధం
2003 ఫిబ్రవరి 9న గుంటూరు దాసరి కల్చరల్ అకాడమీ
రజతోత్సవ సభలో మాట్లాడుతున్న కృష్ణ
ప్రముఖ సినీనటుడు కృష్ణకు నరసరావుపేటతో బలమైన అనుబంధం ఉంది. ఆయన నరసరావుపేటకు చెందిన విజయనిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆయనకు అభిమానులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. 1991 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాదెండ్ల, చిలకలూరిపేట ప్రాంతాల్లో నరసరావుపేట అభ్యర్థి కాసు వెంకట కృష్ణారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో చిలకలూరిపేట నియోజకవర్గం గుంటూరు లోకసభ పరిధిలో ఉండేది. పునర్విభజన తర్వాత నరసరావుపేటలో కలిసింది. తర్వాత 1997లో నరసరావుపేట ద్వితీయ శతాబ్ధి ఉత్సవాలకు విజయనిర్మలతో కలిసి హాజరయ్యారు. ఆ రోజున అప్పటి మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కృష్ణ దంపతులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
స్వతంత్ర అభ్యర్థిని.. కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక