‘సారా’కు దూరంగా.. బతుకుపై నిశ్చింతగా..
సారా తయారీ, రవాణా, విక్రయంతో జీవనం సాగిస్తూ పోలీసులు, అధికారులు ఎప్పుడు దాడి చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే వారి జీవితాల్లో అధికారులు కొత్త వెలుగులు నింపుతున్నారు.
అధికారుల చేయూతతో స్వయం ఉపాధికి బాట
న్యూస్టుడే, మల్లమ్మసెంటర్ (నరసరావుపేట)
చెక్కు పంపిణీ చేస్తున్న పాలనాధికారి శివశంకర్ తదితరులు (పాత చిత్రం)
సారా తయారీ, రవాణా, విక్రయంతో జీవనం సాగిస్తూ పోలీసులు, అధికారులు ఎప్పుడు దాడి చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే వారి జీవితాల్లో అధికారులు కొత్త వెలుగులు నింపుతున్నారు. ఉపాధి మార్గాలు చూపుతూ జీవన భద్రత కల్పిస్తున్నారు. పల్నాడులో నాటుసారా కేంద్రాలుగా పేరున్న గ్రామాల్లోని నిరుపేదలకు అధికారులు నవోదయ, ఆపరేషన్ పరివర్తన్ 2.0 కార్యక్రమాల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతున్నారు. కలెక్టరు, ఎస్పీ, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డీఆర్డీఏ నేతృత్వంలో బాధితులకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి తదితరాల కింద రుణాలు, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందజేసి ఉపాధికి బాటలు వేస్తున్నారు.
పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి, యడ్లపాడు, వెల్దుర్తి, పిడుగురాళ్ల, ఈపూరులతోపాటు పలు మండలాల్లోని గ్రామాల్లో ఎక్కువగా సారా తయారవుతోంది. దీని తయారీ, రవాణా, విక్రయాల్లో మహిళలే ఎక్కువగా పాల్గొంటున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరికి సరైన ఉపాధి మార్గం లేక నాటాసారానే వృత్తిగా మార్చుకున్నారు. మద్యానికి అధిక మొత్తంలో నగదు వెచ్చించలేక నాటాసారా కాయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్తంగా నవోదయ, ఆపరేషన్ పరివర్తన్ 2.0 కార్యక్రమాల ద్వారా నాటాసారా తయారీను కట్టడి చేశారు. సారా తయారీ ముడిసరకులు రవాణా చేసే వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. గతంలో పల్నాడులో నెలకు 70 నుంచి 100 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నెలకు 10 కేసులు కంటే తక్కువ మాత్రమే నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో పరిస్థితి ఇలా...
పల్నాడు జిల్లాలో మొత్తం 77 గ్రామాలు నాటాసారా తయారీ కేంద్రాలుగా గుర్తించారు. వీటిని మూడు కేటగిరీలు ఎ, బి, సి గా విభజించారు. ఎ కేటగిరిలో నాటాసారా తయారీ, రవాణా, విక్రయదారులు, బి కేటగిరిలో రవాణా, విక్రయదారులు, సి కేటగిరీలో విక్రయదారులు ఉండేలా విభజించి కట్టడి చేపట్టారు. ఎ కేటగిరిలో 32 గ్రామాలు, బి లో 15, సిలో 30 గ్రామాలు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఉపాధి కోల్పోయిన బాధితులకు బాసటగా నిలిచేందుకు 384 మందిని ఎంపిక చేశారు. అందులో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆధారంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా 198 మందికి రుణాల ద్వారా ఉపాధి కల్పించారు. ముందస్తుగా 102 మందికి, అనంతరం 96 మందికి బ్యాంకు రుణాలు, శ్రీనిధి ఎస్సీ, ఎస్టీ ఉన్నతి లోన్లు, వడ్డీ లేని రుణాలు ద్వారా ఒక్కొక్కరికి రూ.50 వేలతో ఆటోలు, కిరాణాషాపులు, చికెన్ షాపులు, దుస్తుల వ్యాపారం, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయించి ఉపాధి కల్పిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోండి
సారా వ్యాపారంతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపినా బాధితులకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మళ్లీ సారా వ్యాపారం చేయకుండా ప్రత్యామ్నాయంగా ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకోవాలి. కుటుంబ ఉన్నతికి తోడ్పాటు అందించాలి.
బాలూనాయక్, డీఆర్డీఏ పీడీ
ప్రభుత్వం చేయూతఅందించింది
గతంలో సారా వ్యాపారం చేస్తూ భయపడుతూ జీవనం సాగించేవాళ్లం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ప్రభుత్వం అందించిన బ్యాంకు రుణాల ద్వారా దుస్తుల వ్యాపారం చేసుకుంటున్నాం. నెలకు రూ.5 వేల పైనే రాబడి ఉంది. కష్టపడి పనిచేసుకుంటే ఆనందంగా ఉంది. ఇప్పుడు పోలీసుల భయం లేదు.
వెంకటేశ్వరమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక