చరిత్రలో నిలిచిపోయేలా చంద్రబాబు పర్యటన
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తెదేపా అధినేత చంద్రబాబు ఈనెల 8 నుంచి 10 వరకు చేపడుతున్న పర్యటన చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయటానికి నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా కృషి చేయాలని పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు అన్నారు.
చీరాల గడియార స్తంభం వద్ద పరిశీలిస్తున్న నాయకులు
బాపట్ల, న్యూస్టుడే: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తెదేపా అధినేత చంద్రబాబు ఈనెల 8 నుంచి 10 వరకు చేపడుతున్న పర్యటన చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయటానికి నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా కృషి చేయాలని పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు అన్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై చర్చించటానికి బాపట్లలోని తెదేపా జిల్లా కార్యాలయానికి ఆయన మంగళవారం రాత్రి వచ్చారు. నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ, సీనియర్ నేతలతో సమావేశమై బాబు పర్యటన ఏర్పాట్లపై సూచనలు చేశారు. పట్టణంలో రోడ్షో జరిగే మార్గం, బహిరంగసభ నిర్వహిస్తున్న అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాల కూడలి ప్రాంతాన్ని ఏలూరి పరిశీలించారు. సాంబశివరావు మాట్లాడుతూ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 8న పొన్నూరు, 9న బాపట్ల, 10న చీరాలలో బాబు పర్యటిస్తారని తెలిపారు. వేగేశన మాట్లాడుతూ వైకాపా పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. చీరాలలో అధినేత చంద్రబాబు పర్యటన మార్గాన్ని ఇన్ఛార్జి ఎం.ఎం. కొండయ్యతో కలిసి పరిశీలించారు. తెదేపా నేతలు జేపీ గౌడ్, సలగల రాజశేఖరబాబు, రావిపూడి నాగమల్లేశ్వరరావు, పంగులూరి శ్రీనివాసరావు, తానికొండ దయాబాబు పాల్గొన్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ నెల 8, 9, 10న పర్యటన వివరాలను పార్టీ నేతలు ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
* 8న మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు.
* మధ్యాహ్నం 1.45 గంటల నుంచి పెదకాకాని నుంచి ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన
* 2.30 గంటలకు నారాకోడూరు నుంచి ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన, రైతులతో సమావేశం
* 3.45 గంటలకు వీధి సమావేశం
* 4.30 గంటలకు నారాకోడూరు నుంచి పొన్నూరు వరకు రోడ్షో
* సాయంత్రం ఆరు గంటలకు పొన్నూరు ఎన్జీరంగా విగ్రహం సెంటర్లో బహిరంగసభ
* రాత్రి 8.30 గంటలకు పరంధయ్య కన్వెన్షెన్ సెంటర్లో రాత్రికి బస
* 9న ఉదయం 11 గంటలకు పరంధయ్య కన్వెన్షెన్ సెంటర్లో ముస్లిం మైనార్టీలతో సమావేశం
* మధ్యాహ్నం 2.30 గంటలకు పొన్నూరు నుంచి పయనం
* మధ్యాహ్నం 3.15 గంటలకు బాపట్ల మండలం చుండూరుపల్లి చేరిక
* సాయంత్రం 4.30 గంటలకు ఈతేరు, అప్పికట్ల మీదగా బాపట్ల పట్టణంలోకి ప్రవేశం
* సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల పట్టణం చీలురోడ్డు నుంచి రోడ్షో
* సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు బాపట్ల పట్టణం అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాల కూడలిలో బహిరంగసభ
* రాత్రి ఎనిమిది గంటలకు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల అతిథిగృహంలో బస
* 10న బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల అతిథిగృహంలో 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యార్థులు, బీసీ నేతలతో సమావేశం
* మధ్యాహ్నం 2.20 గంటలకు బాపట్ల మండలం స్టూవర్టుపురం చేరుకుని మహిళలతో సమావేశం
* సాయంత్రం 4.20 గంటలకు ద్విచక్రవాహనాల ప్రదర్శనతో పేరాల సెంటర్కు రాక, అక్కడి నుంచి చీరాల గడియార స్థంభం సెంటర్కు రోడ్షో
* సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు చీరాల గడియారస్తంభం సెంటర్లో బహిరంగసభ
* రాత్రి ఏడు గంటలకు చీరాల నుంచి బయలుదేరి చిలకలూరిపేట మీదుగా గన్నవరం విమానాశ్రయానికి రాత్రి 10.30 గంటలకు చేరుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం