మగధీరా.. ముందుకు రారా
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మగధీరులు నానాటికీ వెనక్కిపోతున్నారు. అన్నింటిలో సగం, ఆకాశంలో సగమంటూ చెప్పుకునే మహిళలు శస్త్రచికిత్సల్లో ముందంజలో నిలుస్తున్నారు.
కు.ని.శస్త్రచికిత్సలకు వెనకడుగు
ఈనాడు-అమరావతి
జీజీహెచ్లోని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల వార్డు
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మగధీరులు నానాటికీ వెనక్కిపోతున్నారు. అన్నింటిలో సగం, ఆకాశంలో సగమంటూ చెప్పుకునే మహిళలు శస్త్రచికిత్సల్లో ముందంజలో నిలుస్తున్నారు. కొన్ని రకాల అపోహలు, అనుమానాలతోనే పురుషులు ఆసక్తి కనబరచటం లేదని వైద్యులు అంటున్నారు. జిల్లాలో అత్యధిక శస్త్రచికిత్సలు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో జరుగుతున్నాయి. ఇక్కడ గడిచిన మూడేళ్లగా పరిశీలిస్తే మగాళ్లకు సంబంధించి మూడునెలలు, ఆరునెలలకు ఓ శస్త్రచికిత్స కూడా జరగడం లేదు. అదే మహిళలైతే ప్రతి రోజు సగటున ఆరేడుగురికి తగ్గకుండా చేయించుకుంటున్నారు..
మహిళల నుంచే అభ్యంతరం
మగవాళ్లు చేయించుకునే వ్యాసెక్టమీలపై కొందరు మహిళలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నా భర్త ఆపరేషన్ చేయించుకుంటే కుటుంబం ఎలా గడుస్తుంది? ఆపరేషన్ చేయించుకుంటే బరువులు ఎత్తకూడదని, ఎక్కువ కాలం పనులు చేయకూడదని ఇలా రకరకాల అపోహలతో ముఖ్యంగా ఆడవాళ్లే మగవారిని నిరుత్సాహపరుస్తున్నారు. అపోహలు వీడి భార్యాభర్తలు ఒక అంగీకారానికి వచ్చి చేయించుకునే శస్త్రచికిత్సనూ పట్టించుకోవడం లేదు.
చేయించుకునేది మధ్య, ధనికవర్గాలే
వ్యాసక్టమీ ఆపరేషన్లు చేయించుకునే ఐదారుగురు కూడా మధ్య, ధనికవర్గాలకు చెందిన వారే. వారిలోనూ విద్యావంతులే ఇవి చేయించుకుంటున్నారు. పేదవర్గాలు, నిరక్షరాస్యులు, ఏమాత్రం చదువుకోనివారు వెయ్యికి ఒక్కరూ చేయించుకోవటం లేదని జీజీహెచ్వర్గాలు తెలిపాయి. మహిళలకు చేసే ట్యూబెక్టమీతో పోలిస్తే మగవారికి చేసేది చాలా చిన్న శస్త్రచికిత్స. వారు దీన్ని చేయించుకుంటే మహిళలకు ఎక్కువ లైఫ్ ఇచ్చినవాళ్లవుతారని, అప్పటికే వారు పిల్లలను కనటానికి సిజేరియన్లు అయి ఉండటం, ఆతర్వాత పిల్లల పెôపకం వంటివి చేయటం వల్ల రక్తహీనత బారినపడి బక్కచిక్కిపోతారు. వీరికే ఏరికోరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తే ఇబ్బందని వైద్యులు అంటున్నారు.
సిజేరియన్తో పాటే శస్త్రచికిత్సలు
సిజేరియన్తో బిడ్డకు జన్మనిచ్చిన వారు కొందరు తమకు ఇక పిల్లలు కలగకుండా శస్త్రచికిత్స చేయాలని కోరతారు. వారికి చేసే శస్త్రచికిత్సలను ఎల్ఎస్సీఎస్ అంటారు. ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. మిగిలిన శస్త్రచికిత్సలతో పోలిస్తే వీటి సంఖ్య రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటోంది. వీటి వల్ల సంబంధిత మహిళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ప్రచారం ఏదీ?
కు.ని.ఆపరేషన్లపై ప్రభుత్వం చేసే ప్రచారం చాలా తక్కువగా ఉంటోంది. సినిమాథియేటర్లు, హోర్డింగ్లపైనే పరిమితంగా ప్రచారం చేస్తోంది. ప్రతి ఊళ్లో ఉండే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు కలిసి ట్యూబెక్టమీ ఆపరేషన్లపై మహిళలను చైతన్యం చేస్తున్నారు. కానీ మగవారిని అలా చైతన్యవరిచేవారు లేరు. ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అపోహలతోనే ఆసక్తి చూపటం లేదు
కౌన్సిలింగ్ ఇచ్చి పురుషులను ఒప్పించాలని చూసినా కొందరు మహిళలు మా వారికి వద్దని పేచీపెడుతున్నారు. మహిళలకు ఐదు నిమిషాలు, పురుషులకైతే మూడు నిమిషాల్లో ఈ ఆపరేషన్ చేసేయొచ్చు. దీనికి కేవలం వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఇబ్బందులేమీ ఉండవు.
ఆచార్య మండవ శ్రీనివాసరావు, కుటుంబ నియంత్రణ విభాగం, జీజీహెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత