అన్నింటా ప్రగతే లక్ష్యం
కొత్త జిల్లా బాపట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ విజయకృష్ణన్
గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్జిందాల్
బాపట్ల, న్యూస్టుడే: కొత్త జిల్లా బాపట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో ప్రతిఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి సీఎం వైఎస్ జగన్ వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గొప్ప వ్యవస్థను తీసుకువచ్చారని పేర్కొన్నారు. జిల్లా ఆవిర్భావం జరిగిన తొమిదిన్నర నెలల్లో లబ్ధిదారులకు 5,885.12 కోట్ల నిధులు అందించినట్లు తెలిపారు. వ్యవసాయశాఖ ద్వారా రైతు భరోసా కింద 6,86,278 మంది రైతులకు రూ.883.48 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. సున్నావడ్డీ కింద 90,469 మందికి రూ.17.66 కోట్లు, బీమా కింద 92,119 మందికి రూ.174.2 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. విద్యాశాఖలో జగనన్న అమ్మఒడి కింద 1,19,953 మంది విద్యార్థులకు రూ.179.93 కోట్లు, విద్యాకానుక ద్వారా రూ.22.94 కోట్లు మంజూరు చేశామన్నారు. నాడు-నేడు కింద 543 పాఠశాలల్లో రూ.193 కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. 14,582 మంది విద్యార్థులకు రూ.36.45 కోట్ల విలువైన ట్యాబ్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో రూ.548.33 కోట్ల వ్యయంతో 30,463 మంది లబ్ధిదారులకు పక్కా గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు. 55 పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రూ.5.28 కోట్ల రాయితీ మంజూరు చేశామన్నారు. నేతన్న నేస్తం కింద 8078 మంది లబ్ధిదారులకు రూ.19.39 కోట్లు, వాహనమిత్ర కింద 6471 లబ్ధిదారులకు రూ.647.10 కోట్లు, మత్స్యకార భరోసా కింద రూ.16,131 మంది మత్స్యకారులకు రూ.92.58 కోట్ల సాయం చేసినట్లు వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వైఎస్సార్ చేయూత కింద 85,846 మంది లబ్ధిదారులకు రూ.439.13 కోట్లు, 2,29,726 మందికి పింఛన్ల కింద రూ.62.85 కోట్లు, ఆసరా కింద రూ.476.75 కోట్లు, సున్నావడ్డీ కింద 31,775 మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.123.86 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తోందన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆరుగురు జిల్లా అధికారులు, 89 మంది అధికారులు, 323 మంది మండల, గ్రామస్థాయి సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ మైదానంలో పర్యటించి పోలీసు సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులు రమాదేవి, అన్నమ్మను సత్కరించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి, జేసీ శ్రీనివాసులు, ఏఎస్పీ మహేష్, డీఆర్వో లక్ష్మీ శివజ్యోతి, ఆర్డీవోలు రవీంద్ర, సరోజిని, పార్థసారథి పాల్గొన్నారు.
ఉత్తమ శకటాలుగా గృహనిర్మాణ, డీఆర్డీఏ.. వేడుకల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై శాఖల వారీగా శకటాలు ప్రదర్శించారు. డీఆర్డీఏ, గృహనిర్మాణ శాఖ శకటాలు ప్రథమ, విద్యాశాఖ శకటం ద్వితీయ స్థానంలో నిలిచారు. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ శకటాలు, స్టాళ్లకు బహుమతులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్