రైతుకు ప్రోత్సాహం.. యువతకు సహకారం..
పీఎం ప్రమాణ్ ద్వారా ప్రకృతి సాగు ప్రోత్సహించడంలో కోటిమంది రైతులకు సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.
ఈనాడు-అమరావతి: పీఎం ప్రమాణ్ ద్వారా ప్రకృతి సాగు ప్రోత్సహించడంలో కోటిమంది రైతులకు సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ప్రకృతిసాగు చేపట్టేవారికి ఇది ప్రయోజకరం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 48వేల మంది రైతులు ప్రకృతిసాగులో ఉన్నారు. నాణ్యమైన పత్తి దిగుబడిని పెంచడానికి ప్రభుత్వం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తారు. మూడు జిల్లాల పరిధిలో 2లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతున్నందున రైతులకు ప్రయోజనకరం. మూడు జిల్లాల్లో ఉద్యానపంటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ పథకం ద్వారా నాణ్యమైన మొక్కల లభ్యత పెరుగుతుంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరైజ్డ్ చేయడానికి కేంద్రం నిధులు కేటాయించింది. దీంతో పీఏసీఎస్ల్లోనూ డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
* దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6835కోట్లు కేటాయించారు. మనజిల్లాలో మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్కు నిధులు రానున్నాయి. ఇప్పటికే ఇక్కడ వైద్యసేవలు అందుతుండగా మరిన్ని మెరుగైన సౌకర్యాల అభివృధ్ధికి నిధులు వెచ్చించనున్నారు.
* గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పురుషులతో పోల్చితే మహిళల జనాభా ఎక్కువ. కేంద్రబడ్జెట్లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో రూ.2లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉండటం అతివలకు కలిసివస్తోంది.
* యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటుచేయనున్నట్లు బడ్జెట్లో ఆర్థికమంత్రి ప్రకటించారు. దీనివల్ల నాణ్యమైన పుస్తకాల లభ్యత పెరిగి యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నర్సింగ్ కళాశాల ఏర్పాటు, సాగులో స్టార్టప్లకు పెద్దపీట వేయడం, యువత నైపుణ్యాల వృద్ధికి నిధుల కేటాయింపు ద్వారా యువతకు ప్రోత్సాహం అందించనున్నారు. మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయించడంతో ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి.
* రైల్వేబడ్జెట్కు నిధులను పెంచడంతోపాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. వందేభారత్ రైలును సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుపుతామని ప్రకటించిన నేపథ్యంలో ట్రాక్ను అభివృద్ధి చేయనున్నారు. ఈరైలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల గుండా ప్రయాణిస్తుండటంతో మూడు జిల్లాల పరిధిలో ట్రాక్ అభివృద్ధి చేయడంతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి.
మధ్యతరగతి వారికి వెసులుబాటు
పన్ను రిబేటు రూ.5లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచడం వల్ల చాలామంది పన్ను నుంచి మినహాయింపు తీసుకునే వెసులుబాటు లభించింది. . రాబోయే రోజుల్లో ఆదాయం ఉన్నవారందరూ కొత్త పన్ను విధానంలోకి వచ్చే మౌలికసదుపాయాల కల్పనకు రూ.10లక్షల కోట్లు కేటాయింపు ప్రగతి బాటే.
కె.వి.బ్రహ్మం, ఆడిటర్
కేటాయింపులు సరే... పంపిణీ ఏదీ?
రైతు రుణాలకు భారీగా కేటాయించినా క్షేత్రస్థాయి ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకులు తనఖా లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టాల్సింది.
యలమంచిలి శివాజీ, మాజీ ఎంపీ
మౌలికం...కీలకం
కేంద్ర నిర్ణయంతో మౌలిక వసతులు కల్పన, రక్షణ రంగం బలోపేతం అవుతుంది. తద్వారా ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేసినట్లయింది. జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి వృత్తివిద్యాకోర్సులు నేర్చుకున్న యువత అనేకమంది ఉన్నారు..వీరికి కేంద్ర బడ్జెట్ ఆశలు రేపింది.
బైరిశెట్టి మల్లికార్జునరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
స్వతంత్ర అభ్యర్థిని.. కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక