లోపం ఎక్కడుంది?
సర్వజనాసుపత్రి ప్రసూతి విభాగంలో చేరిన గర్భిణికి గర్భం పోవడానికి ప్రైవేటు రక్తనిధి కేంద్రం నుంచి తెచ్చిన రక్తం ఎక్కించడమే కారణమా? ఇపుడు అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న? వైద్యులు దీనిపై తర్జనభర్జన పడుతున్నారు.
జీజీహెచ్లో రక్తం ఉన్నా బయట నుంచి తెప్పిస్తున్న వైనం
గర్భం పోవడానికి రక్తం ఎక్కించడమే కారణమా?
గుంటూరు వైద్యం, న్యూస్టుడే
సర్వజనాసుపత్రి కాన్పుల వార్డు
సర్వజనాసుపత్రి ప్రసూతి విభాగంలో చేరిన గర్భిణికి గర్భం పోవడానికి ప్రైవేటు రక్తనిధి కేంద్రం నుంచి తెచ్చిన రక్తం ఎక్కించడమే కారణమా? ఇపుడు అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న? వైద్యులు దీనిపై తర్జనభర్జన పడుతున్నారు. మూడు రోజుల నుంచి లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. విశ్లేషణలు చేస్తున్నారు. జీజీహెచ్కి ఈనెల 3వ తేదీ కాన్పు కోసం వచ్చిన ఆమెకు పరీక్షలు నిర్వహించిన అనంతరం రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని నిర్ణయించారు. అవసరమైన రక్తాన్ని ప్రైవేటు రక్తనిధి కేంద్రం నుంచి తెప్పించారు. ఆ రక్తం ఎక్కించిన అనంతరం గర్భిణికి జ్వరం వచ్చినట్లు తెలుసుకున్నారు. ఈనెల 4వ తేదీన గర్భం పోయిందని నిర్ధారించి గర్భసంచి శుభ్రం కావడానికి వైద్యులు మందులు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోంది.
230 యూనిట్లు నిల్వ ఉన్నా..
సర్వజనాసుపత్రిలో రక్త నిల్వలు సరిపడా ఉన్నా ప్రైవేటు రక్త నిధి నుంచి డబ్బులు పెట్టి ఎందుకు తెప్పిస్తున్నారో? ఎవరికీ అంతుపట్టని సమస్యగా మారింది. తాజాగా దాతలు ఇచ్చిన అన్ని గ్రూపుల రక్తం 230 యూనిట్ల నిల్వ ఉంది. ఆస్పత్రి అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుతున్నారు. ప్రసూతి విభాగం నుంచి రక్తం కోసం ఎప్పుడు ఇండెంట్ వచ్చినా లేదనకుండా సరఫరా చేస్తున్నారు. జీజీహెచ్లో అందరికీ ఉచితంగానే రక్తం ఇస్తారు. రోగి తరఫున ఎవరైనా రక్తదానం చేయమని అడుగుతుంటారు. నిల్వలు ఎక్కువగా ఉంటే రక్తదానం చేయమని అడగరు. అదేవిధంగా అత్యవసర కేసులకు ఎలాంటి షరతులు లేకుండా 24 గంటలూ రక్తం యూనిట్లు ఇస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రైవేటు రక్త నిధి కేంద్రాల నుంచి తెచ్చుకోమని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? రక్తం తెచ్చుకునేందుకు ఎవరు అనుమతిస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? విచారణ చేస్తేనే వాస్తవాలు బయటపడనున్నాయి. వాస్తవానికి సర్వజనాసుపత్రిలో చికిత్స పొందే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి, ప్రాణాలను కాపాడే రక్తం ఎవరికి అవసరమైనా సంబంధిత విభాగం నుంచి రక్తనిధి కేంద్రానికి తెలియజేయాలి. ఆ గ్రూపు రక్తం లేకపోతే ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తారు. దీని ఆధారంగా సూపరింటెండెంట్ లేదా ఆర్ఎంవో అనుమతి తీసుకుని ప్రైవేటు రక్తనిధి నుంచి తెప్పించుకునే వెసులుబాటు ఉంది. జీజీహెచ్లోని రక్తనిధి కేంద్రంలో సంప్రదించకుండానే నేరుగా బయటి నుంచి ఎందుకు రక్తం తెప్పించారో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
గతంలోనూ ఇబ్బందులు వచ్చాయి
సర్వజనాసుపత్రి రక్తనిధి కేంద్రం నుంచి సరఫరా చేసిన రక్తం ఎక్కించిన అనంతరం కూడా ఒకటి, రెండు సార్లు రోగులకు రియాక్షన్ వచ్చినట్లు తెలిసింది. దీనిపై విశ్లేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రైవేటుగా తెప్పించిన రక్తం ఎక్కించిన అనంతరం గర్భిణి అనారోగ్యానికి గురైంది. గర్భం పోవడానికి చాలా కారణాలుంటాయి. దీనికి కారణం ఏమిటనేది తెలుసుకుంటున్నాం.
ప్రభావతి, సూపరింటెండెంట్ జీజీహెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!