logo

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు గడువు ఇవ్వాలి

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను మూడు నెలల తర్వాత నిర్వహించాలని జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Published : 28 Mar 2023 06:10 IST

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను మూడు నెలల తర్వాత నిర్వహించాలని జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో నిర్వహించడం వల్ల అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని, కనీసం మూడు నెలల తర్వాత ఆ పరీక్షను నిర్వహించాలన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఏటా 2,30,000 ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారని, ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు సమయం పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు విద్యార్థి నాయకులు ధర్మతేజ, నరేంద్ర, హరీష్‌, ప్రశాంత్‌, ప్రతాప్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని