పది పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ వెల్లడించరు. ఆమె శుక్రవారం విలేకరులతో ఏర్పాట్లపై మాట్లాడుతూ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 138 కేంద్రాల్లో 27,714 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.
మాట్లాడుతున్న డీఈవో శైలజ
గుంటూరు విద్య, న్యూస్టుడే: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ వెల్లడించరు. ఆమె శుక్రవారం విలేకరులతో ఏర్పాట్లపై మాట్లాడుతూ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 138 కేంద్రాల్లో 27,714 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి వివరించారు. అవి ఆమె మాటల్లోనే.. పరీక్షకు 14,693 మంది బాలురు, 13,019 మంది బాలికలు హాజరవుతారు. సీ కేటగిరి కేంద్రాలు 16 ఉండగా, నాలుగింటిలో సీసీ కెమారాల పర్యవేక్షణ ఉంటుంది. చీఫ్ సూపరింటెండెంట్లు 138, డిపార్టుమెంటల్ అధికారులు 138, రూట్ అధికారులు 15, అసిస్టెంట్ రూట్ అధికారులు 15, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 5, సిట్టింగ్ స్క్వాడ్ 12 బృందాలు ఏర్పాటు చేశాం. 1400 మంది ఉపాధ్యాయులకు ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించాం. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులను 8.45 గంటలకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నాం. విద్యార్థుల వివరాలతో ఓఎంఆర్ ఇస్తారు. వాటిని విద్యార్థులు పరిశీలించుకుని ఏవైనా తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి. చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు కేంద్రంలోకి అనుమతి లేదు. విద్యార్థులతో పాటు విధుల్లో ఉన్న సిబ్బందికి ఈ నిబంధన వర్తిస్తుంది. విధులకు సమయానికి రిపోర్టు చేయాలి. ఈ విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించినా, ప్రధానోపాధ్యాయులు రిలీవ్ చేయకపోయినా నిబంధనల మేరకు శాఖాపర చర్యలు తప్పవు.
హాల్టికెట్లు తప్పనిసరిగా తెచ్చుకోవాలి: విద్యార్థులు హాల్టికెట్లతో తప్పనిసరిగా హాజరుకావాలి. పెన్, పెన్సిల్, స్కేల్ వంటివి తెచ్చుకోవచ్చు. హాల్టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు హాల్టికెట్లు చూపితే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈసారి పరీక్షలో ఇచ్చే ప్రశ్నపత్రంపైనా నంబరింగ్ ఉంటుంది. విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. అదనపు పత్రాలు అడిగితే 12 పేజీల బుక్లెట్ ఇస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఏ విద్యార్థి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండదు.
కంట్రోల్ రూం ఏర్పాటు: అన్నీ పరీక్ష కేంద్రాల్లో బెంచ్లు, తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుంది. ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు చరవాణి 99513 97109, 92475 77313 సంఖ్యలను సంప్రదించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోం ఓటింగ్ నిలిపివేత
[ 04-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని లేవల్లపాడు గ్రామంలో సీలు లేకుండా జరుగుతున్న హోం ఓటింగ్ను తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు శనివారం నిలిపివేశారు. -
జగన్, జవహర్రెడ్డికి వృద్ధుల ఉసురు తగులుతుంది: వర్ల రామయ్య
[ 04-05-2024]
జగన్ను అదికారంలో ఉంచడమే సీఎస్ జవహర్రెడ్డి లక్ష్యమని తెదేపా సీనియర్నేత వర్ల రామయ్య ఆరోపించారు. -
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
[ 04-05-2024]
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు
[ 04-05-2024]
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
‘పేదకు నరకం’.. లేదే కనికరం..
[ 04-05-2024]
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. -
‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
[ 04-05-2024]
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. -
రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
[ 04-05-2024]
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. -
372 సమస్యాత్మక కేంద్రాలు
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
[ 04-05-2024]
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు. -
తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్
[ 04-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. -
జగన్.. మాపై ఎందుకీ కక్ష?
[ 04-05-2024]
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. -
జగన్ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం
[ 04-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?