అనిశాకు చిక్కిన అవినీతి చేప
మండలంలోని పొన్నపల్లి వీఆర్వో నీలం స్వాతి ఆన్లైన్లో భూమి యజమాని పేరు నమోదుకు చేసేందుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారు(అనిశా)కు మంగళవారం పట్టుబడ్డారు.
ఆన్లైన్లో భూమి నమోదుకు లంచం డిమాండ్
రైతు నుంచి రూ.18వేలు తీసుకుంటుండగా పట్టివేత
లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో స్వాతి
పొన్నపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్టుడే: మండలంలోని పొన్నపల్లి వీఆర్వో నీలం స్వాతి ఆన్లైన్లో భూమి యజమాని పేరు నమోదుకు చేసేందుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారు(అనిశా)కు మంగళవారం పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీలు ప్రతాప్, సత్యానంద్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలో గుళ్లపల్లికి చెందిన రైతు వాగు దినేష్కు పొన్నపల్లిలో ఎకరా యాభై సెంట్ల భూమి ఉంది. ఆ భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఈనెల 24న వీఆర్వో స్వాతిని కలిసి విన్నవించారు. ఆమె తన అధికారిక లాగిన్ నుంచి ఆన్లైన్లో రైతు కుటుంబ సభ్యుల పేరిట స్వయంగా దరఖాస్తు చేశారు. తదుపరి నమోదు ప్రక్రియ పూర్తి చేయడానికి ఆమె రైతు నుంచి రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. తాను అంత మొత్తం ఇవ్వలేనని రైతు చెప్పడంతో రూ.2వేలు తగ్గించుకుని రూ.18వేలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో బాధిత రైతు అనిశాని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం ఉదయం పొన్నపల్లి గ్రామ సచివాలయంలో వీఆర్వోకు రూ.18వేలు నగదు అందించాడు. వెంటనే అనిశా అధికారులు దాడి చేసి వీఆర్వో స్వాతిని అదుపులోకి తీసుకుని ఆమె నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకుని చెరుకుపల్లి ఇన్ఛార్జి తహసీల్దార్ మల్లికార్జునరావు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ దాడిలో దాదాపు 14 మంది అనిశా సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన వీఆర్వో స్వాతి 2012లో గుళ్లపల్లిలో వీఆర్ఏగా విధుల్లో చేరారు. రెండేళ్ల క్రితం ఈమె వీఆర్ఏ నుంచి వీఆర్వోగా పదోన్నతి పొందారు.
మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీలు ప్రతాప్, సత్యానంద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి: నారా రోహిత్
[ 07-05-2024]
ఏపీ ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లో తప్పిదం.. ఇద్దరు అధికారులపై చర్యలు
[ 07-05-2024]
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్లో జరిగిన తప్పిదంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. -
ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!
[ 07-05-2024]
ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్నిక్ స్పాట్లా మార్చారు. -
జగన్ మార్కు ఇసుక దోపిడీ
[ 07-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
[ 07-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
ఎస్సీ రైతులపై కపట ప్రేమ
[ 07-05-2024]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. -
‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’
[ 07-05-2024]
ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్షో నిర్వహించారు. -
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
[ 07-05-2024]
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
[ 07-05-2024]
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. -
గడప గడపకు కిలాడి మాటలు
[ 07-05-2024]
భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. -
పోరాట బాట.. గెలుపు బాసట
[ 07-05-2024]
చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. -
నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
[ 07-05-2024]
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. -
వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
[ 07-05-2024]
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య