ప్రాణం తీసిన ఈత సరదా
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
కాలువల్లో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి
మేడికొండూరు, న్యూస్టుడే: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం. కొన్నేళ్ల కిందట కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు కార్తిక్(20) మేడికొండూరు మండలంలోని ఒక కళాశాల వసతిగృహంలో ఉంటూ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం శ్రీరామ నవమి కావడంతో కళాశాలకు సెలవు ప్రకటించారు. పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్తున్నామని చెప్పి కార్తిక్, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి కళాశాల నుంచి బయటకు వచ్చారు. కాసేపటికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బండారుపల్లి మేజర్ కాలవ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కార్తిక్ ఈత కొట్టేందుకు గట్టుపై నుంచి కాలువలోకి దూకాడు. తొలుత రెండుసార్లు దూకి పైకి వచ్చిన అతడు.. మూడోసారి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో స్నేహితులు మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జయ్కుమార్ సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. స్థానికులు, ఈతగాళ్ల సాయంతో కాలువలో సుమారు నాలుగు గంటల పాటు జల్లెడ పట్టారు. ఘటనా స్థలికి కిలో మీటరు దూరంలో కార్తిక్ మృతదేహాన్ని గుర్తించారు. అతడి తల భాగం వద్ద రక్తపు గాయం ఉంది. ఈతకు దూకిన క్రమంలో నేలకు తగిలి గాయమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంగం జాగర్లమూడి వద్ద..
తెనాలి టౌన్, న్యూస్టుడే: ఈతకు కాలువలో దిగిన విద్యార్థి మృతి చెందిన ఘటన ఇది. తెనాలి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం... చేబ్రోలు మండలం వడ్లమూడి వద్ద ఉన్న కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్ధులు బుధవారం సాయంత్రం తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని సంగమేశ్వరాలయానికి వచ్చారు. వారిలో విద్యార్థి గల్లా వంశీకృష్ణ (18) కాలువలో ఈతకు దిగి ఒరవడికి కొట్టుకు పోయాడు. గమనించిన తోటి విద్యార్థి రక్షించే ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు కాలువలో దిగి వెతికారు. తుదకు రాత్రి వంశీకృష్ణ మృతదేహం లభించింది. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామానికి చెందిన వాడని పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దు: ఈసీకి కూటమి విజ్ఞప్తి
[ 01-05-2024]
గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితం అయ్యే 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వు చేయాలని కూటమి నేతలు మారోమారు ఈసీని కోరారు. -
పండుటాకులే ఎండగడతాయి జగన్!
[ 01-05-2024]
వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం, దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు. -
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
[ 01-05-2024]
నందమూరినగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో పెద్ద మొత్తంలో పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్ల కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీటిని ఆర్డర్ ఇచ్చాడని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్ యజమాని గురుప్రసాద్ చెబుతున్నారు. -
అరాచక మూకలను ఓడించండి!
[ 01-05-2024]
‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. -
ప్రతిపక్షాలపై కక్ష.. పింఛనర్లకే శిక్ష
[ 01-05-2024]
పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది. -
కార్మికలోకం కకావికలం
[ 01-05-2024]
అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మూడు ప్రాంతాల అభివృద్ధికి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి. అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. తెదేపా కన్నా దీటుగా రాజధాని నిర్మిస్తాను. -
కరకట్టపై కక్ష...!
[ 01-05-2024]
అమరావతి అంటేనే పొడ గిట్టని సీఎం జగన్.. దానిని ధ్వంసం చేసేందుకు శక్తిమేర ప్రయత్నించారు. రాజధానికి వెళ్లేందుకు సరైన అనుసంధాన రహదారి లేకుండా చేశారు. కరకట్ట రోడ్డును విశాలంగా విస్తరిస్తానని శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చి.. ఆనక మడమ తిప్పేశారు. -
‘మే’మూ కడతాం ఇసుకాసురులకు పా‘డే’
[ 01-05-2024]
పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చెందిన రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడు. 2019 వరకూ సొంతూరులోనే పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో హాయిగా కాలంగా వెళ్లదీశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. -
తీరాన ప్రజాగళానికి సన్నద్ధం
[ 01-05-2024]
-
ఏకోపాధ్యాయ పాఠశాలలు.. దిగజారిన విద్యా ప్రమాణాలు
[ 01-05-2024]
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారకుండా చూస్తాం.. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలును విస్మరించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయకుండానే అయిదేళ్ల పాలన పూర్తి చేశారు. -
‘జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’
[ 01-05-2024]
రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్న జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్లెల వెంకట్రావు కోరారు. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అభ్యర్థి, న్యాయవాది గుర్రం రామారావుతో కలసి అమరావతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ..
[ 01-05-2024]
తెదేపా జాతీయ కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. -
‘వైకాపా పాలనలో ఛార్జీల బాదుడు’
[ 01-05-2024]
వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు. -
శిడిమాను ఉత్సవం..భక్త సంబరం
[ 01-05-2024]
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో జగన్మాత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది. -
కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు
[ 01-05-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని రసూల్ పేట, కొత్తపేట, బీసీ కాలనీలో మంగళవారం తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సప్లిమెంటరీ ఫీజుల చెల్లింపునకు మే 4 వరకు గడువు
[ 01-05-2024]
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లించేందుకు గడువు మే 4 వరకు ఉందని డీఈవో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. -
వైకాపాకు గుంటూరు డిప్యూటీ మేయర్ సజీల రాజీనామా
[ 01-05-2024]
వైకాపాకు రాజీనామా చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.