కీలక ఘట్టానికి వేళాయె
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి 25వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ
ఈనాడు-అమరావతి, కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేస్తారు. ఈ నెల 21 ఆదివారం కావడంతో ఆ రోజు స్వీకరించరు. గుంటూరు పార్లమెంటు స్థానానికి జిల్లా కలెక్టరేట్లో, అసెంబ్లీలకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ మధ్య నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరిస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురికి ఆర్వో ఛాంబర్లోకి అనుమతి ఉంటుంది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ.25వేలు, అసెంబ్లీకి రూ.10వేల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో సగం కడితే సరిపోతుంది. నామినేషన్ల దాఖలు గడువు పూర్తయిన తర్వాత ఈ నెల 26న వాటిని పరిశీలిస్తారు. 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 29న సాయంత్రం 3గంటల తర్వాత అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు.
వంద మీటర్లలోకి అయిదుగురికే అనుమతి.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి బలం చూపేలా మందీ మార్బలంతో నామినేషన్ దాఖలు చేసేందుకు తరలివస్తారు. అయితే వారందరినీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల అవతలే నిలిపివేస్తారు. అక్కడి నుంచి రిటర్నింగ్ అధికారి వద్దకు కేవలం అభ్యర్థితో పాటు అయిదుగురు సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. నామపత్రాల స్వీకరణకు సంబంధించి గతంలో ఉన్న ఫారం 26ను ప్రస్తుతం ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో నూతన విధానంలోనే అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేయాల్సి ఉంది.
జిల్లాలో 17.87లక్షల ఓటర్లు.. జిల్లాలో ప్రస్తుతం 17.87 లక్షల మంది ఓటర్లున్నారు. వీరికి 1915 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర బలగాలను నియమిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ, వెబ్ కాస్టింగ్, సూక్ష్మ పరిశీలకుల పర్యవేక్షణ ఉంటుంది. ఎన్నికల విధుల్లో 13,800 మంది సిబ్బంది పాల్గొంటారు.
కీలకమైన తేదీలివే...
నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 18
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26
ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ మే 13
ఓట్ల లెక్కింపు, ఫలితాలు జూన్ 4
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దు: ఈసీకి కూటమి విజ్ఞప్తి
[ 01-05-2024]
గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితం అయ్యే 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వు చేయాలని కూటమి నేతలు మారోమారు ఈసీని కోరారు. -
పండుటాకులే ఎండగడతాయి జగన్!
[ 01-05-2024]
వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం, దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు. -
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
[ 01-05-2024]
నందమూరినగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో పెద్ద మొత్తంలో పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్ల కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీటిని ఆర్డర్ ఇచ్చాడని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్ యజమాని గురుప్రసాద్ చెబుతున్నారు. -
అరాచక మూకలను ఓడించండి!
[ 01-05-2024]
‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. -
ప్రతిపక్షాలపై కక్ష.. పింఛనర్లకే శిక్ష
[ 01-05-2024]
పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది. -
కార్మికలోకం కకావికలం
[ 01-05-2024]
అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మూడు ప్రాంతాల అభివృద్ధికి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి. అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. తెదేపా కన్నా దీటుగా రాజధాని నిర్మిస్తాను. -
కరకట్టపై కక్ష...!
[ 01-05-2024]
అమరావతి అంటేనే పొడ గిట్టని సీఎం జగన్.. దానిని ధ్వంసం చేసేందుకు శక్తిమేర ప్రయత్నించారు. రాజధానికి వెళ్లేందుకు సరైన అనుసంధాన రహదారి లేకుండా చేశారు. కరకట్ట రోడ్డును విశాలంగా విస్తరిస్తానని శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చి.. ఆనక మడమ తిప్పేశారు. -
‘మే’మూ కడతాం ఇసుకాసురులకు పా‘డే’
[ 01-05-2024]
పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చెందిన రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడు. 2019 వరకూ సొంతూరులోనే పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో హాయిగా కాలంగా వెళ్లదీశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. -
తీరాన ప్రజాగళానికి సన్నద్ధం
[ 01-05-2024]
-
ఏకోపాధ్యాయ పాఠశాలలు.. దిగజారిన విద్యా ప్రమాణాలు
[ 01-05-2024]
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారకుండా చూస్తాం.. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలును విస్మరించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయకుండానే అయిదేళ్ల పాలన పూర్తి చేశారు. -
‘జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’
[ 01-05-2024]
రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్న జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్లెల వెంకట్రావు కోరారు. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అభ్యర్థి, న్యాయవాది గుర్రం రామారావుతో కలసి అమరావతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ..
[ 01-05-2024]
తెదేపా జాతీయ కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. -
‘వైకాపా పాలనలో ఛార్జీల బాదుడు’
[ 01-05-2024]
వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు. -
శిడిమాను ఉత్సవం..భక్త సంబరం
[ 01-05-2024]
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో జగన్మాత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది. -
కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు
[ 01-05-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని రసూల్ పేట, కొత్తపేట, బీసీ కాలనీలో మంగళవారం తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సప్లిమెంటరీ ఫీజుల చెల్లింపునకు మే 4 వరకు గడువు
[ 01-05-2024]
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లించేందుకు గడువు మే 4 వరకు ఉందని డీఈవో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. -
వైకాపాకు గుంటూరు డిప్యూటీ మేయర్ సజీల రాజీనామా
[ 01-05-2024]
వైకాపాకు రాజీనామా చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట