ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది.
ఇంటికే పింఛను ఇవ్వాలని వృద్ధుల వేడుకోలు
ఆధార్తో అనుసంధానం.. ఏటీఎం కార్డులు లేవు
బ్యాంకులకు వెళ్లాలంటే ఛార్జీల భారం
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, నెహ్రూనగర్, మంగళగిరి, పెదకాకాని
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. లబ్ధిదారులు వ్యయ, ప్రయాసలకోర్చి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించింది. అధికార వైకాపా ప్రభుత్వం పింఛన్ల పంపిణీని రాజకీయ కోణంలో చూడడం వల్లే ప్రస్తుతం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అడుగు తీసి అడుగువేయలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్లో ఎంత మంది బ్యాంకులకు వెళ్లి పింఛను డబ్బులు తీసుకోగలరో అధికారులు ఆలోచించాలి.
దుష్ప్రచారానికి వైకాపా యత్నాలు...
సార్వత్రిక ఎన్నికల ముంగిట వేసే పింఛను కావడంతో ఏదో విధంగా లబ్ధిదారులకు అసౌకర్యం కలిగించి ఇదంతా విపక్షాల వల్లేనని దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని అధికార వైకాపా చూస్తోంది. వాలంటీర్లతో ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే విధానాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, అందువల్లే మీకు ఈ కష్టాలు వచ్చాయని చెప్పడానికి తాజాగా ఈ నిర్ణయం తీసుకుందనేది స్పష్టమవుతోంది. వాలంటీర్లను ఇంటింటికీ పంపకూడదని చెప్పిందే తప్ప సచివాలయ ఉద్యోగులను కాదు. మే 1న లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛను సొమ్ములు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది ఉన్నా వినియోగించుకోకుండా సిబ్బంది లేరని కుంటిసాకులు చెబుతోంది.
ఇలా సాధ్యమే కదా...
మే 13న పోలింగ్. అప్పటి దాకా సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే అంగన్వాడీలు, మెప్మా ఉద్యోగుల సహకారం తీసుకోవచ్చు. ఒకటి, రెండు రోజుల్లో లబ్ధిదారుల ఇంటికే పంపి పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ఎంతసేపటికీ సిబ్బంది లేరని బూచిగా చూపి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి అంతిమంగా విపక్షాల్ని తిట్టించాలనేది పాలకుల తీరుగా మారింది.
ఇంటింటికీ వెళ్లి ఇచ్చే వెసులుబాటు ఉన్నా..
ఏప్రిల్ 1న పింఛన్ కోసం ఎదురుచూపులు
జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలు 568 ఉన్నాయి. ఇందులో 4,368 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు 2,59,989 ఉన్నాయి. ఒక్కో సచివాలయ పరిధిలో సగటున 462 పింఛన్లు ఉన్నాయి. సచివాలయాల్లో సిబ్బంది ఒక్కొక్కరు 60 చొప్పున పంపిణీ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. సచివాలయ సిబ్బంది చరవాణిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని డివైజ్ ద్వారా పింఛను పంపిణీ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన డివైజ్లు అందుబాటులో ఉన్నాయి. వార్డు, గ్రామ సచివాలయం సిబ్బంది ప్రతి విభాగానికి ఒక్కొక్కరు చొప్పున అందుబాటులో ఉన్నారు. పింఛను లబ్ధిదారులకు ఒకటి, రెండు రోజుల్లోనే ఇంటి వద్దే నూరు శాతం నగదు పంపిణీ చేసే అవకాశం ఉంది.
ఖాతాల్లో వేస్తే కష్టాలు ఇవి..
- ప్రస్తుతం బ్యాంకు అకౌంట్లు ఉన్న వారి ఖాతాకు నగదు జమ చేయాలని ఆదేశించింది. లేనివారికి ఇంటి వద్దే పంపిణీ చేయాలని సూచించింది. అసలు ఎవరికి బ్యాంకు ఖాతా ఉంది? ఎవరికి లేదో సచివాలయానికి వెళితే తప్ప వివరాలు తెలుసుకోలేని పరిస్థితి.
- ఆపై ఆధార్ లింకు అయిన బ్యాంకు ఖాతాకే జమ చేస్తామంటోంది. ఆ వృద్ధుల్లో ఎందరికి బ్యాంకుతో ఆధార్ అనుసంధానమై ఉంటుందో ఆలోచించాలి.
- వృద్ధులకు పింఛను సొమ్ములే ఆధారం ఇన్నాళ్లూ వారు ఖాతాల్లో ఎలాంటి సొమ్ము జమ చేయలేదు. ఏటీఎం కార్డులు లేని వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటివారు నేరుగా బ్యాంకుకే వెళ్లాలి. అది లేనివారు విత్డ్రా ఫాం నింపి తీసుకోవాలి. దాన్ని రాయించుకోవడానికి ఇతరులపై ఆధారపడాలి. లైనులో నిల్చుని సంతకం చేసి డబ్బులు తెచ్చుకోవాలి. బ్యాంకు శాఖలు దూరంగా ఉన్నవారికి ఇబ్బందులు తప్పేలా లేవు.
- కొందరి బ్యాంకు ఖాతాలు లావాదేవీలు లేని కారణంగా, కనీస నగదు నిల్వ లేక మనుగడలో లేవు. ఫలితంగా ఖాతా నిర్వహణ ఛార్జీల పేరుతో పింఛన్ల రుసుముల నుంచి కోత విధించే అవకాశం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రాణాలు పోయిన ఉదంతాలు కదిలించలేదా?
ఏప్రిల్ ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయాలకు పిలిచి పంపిణీ చేస్తేనే అప్పట్లో చాలా మంది వృద్ధులు సచివాలయాలకు అతికష్టం మీద వచ్చి కుప్పకూలిపోయారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం అవేమి పరిగణనలోకి తీసుకోకుండా మే 1న పంపిణీ చేయాల్సిన పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని సీఎస్ జవహర్రెడ్డి ఆదేశాలివ్వడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.
బ్యాంకులో డబ్బులు డ్రా చేయడం రాదు
చిన్నా, గుంటూరు
నేను చదువుకోలేదు. పింఛను డబ్బులు బ్యాంకుల్లో వేస్తామంటే వాటిని ఎలా తీసుకోవాలో తెలియదు. ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు తీవ్రంగా ఉన్నాయి. ఇంత ఎండలో బ్యాంకుల దాకా వెళ్లాలంటే ఇబ్బంది. ఆటో ఛార్జీలు అవుతాయి. అంతచేసి అక్కడికి వెళితే క్యూలైన్లో నిల్చోలేని పరిస్థితి. ఎప్పటిలాగా ఇంటి వద్దకు వచ్చి ఇవ్వాలి.
ఖాతా వాడడం లేదు
హనుమంతురావు, గుంటూరు
నా బ్యాంకు ఖాతాను గత అయిదేళ్లుగా వాడడం లేదు. ఆ తర్వాత నాకు వయోభారం పెరగడంతో బ్యాంకుకు వెళ్లలేకపోయాను. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే హడలిపోతున్నాం. అంత ఎండలో బ్యాంకుకు వెళ్లి నా ఖాతా వినియోగంలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నాలాంటి వృద్ధులకు పింఛన్లు ఇంటి వద్దకు వచ్చి ఇస్తే బాగుంటుంది.
ప్రాణాలతో చెలగాటమా!
- ఆత్మకూరి వెంకటేశ్వర్లు, పెదకాకాని
పింఛనుదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. బ్యాంకు సేవలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటలకు ముగుస్తాయి. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇంతటి ఎండలో బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోమని చెప్పడం దారుణంగా ఉంది. వడదెబ్బకి గురై ప్రాణాల మీదకు తెచ్చుకోమని సీఎస్ చెబుతున్నట్లు ఉంది. ఓట్ల కోసం రాజకీయం చేయడం దారుణం.
సచివాలయ ఉద్యోగులతో పంపిణీ సులభ
- వి.శ్రీనివాసరావు, మంగళగిరి
పింఛన్లు ఇంటి వద్దే ఇవ్వడం చాలా తేలికైన విషయం. ఒక్కో గ్రామంలో రెండు సచివాలయాలు ఉంటున్నాయి. వాటిలో కనీసం 16 మంది ఉద్యోగులు ఉంటున్నారు. ఆ గ్రామ పింఛనుదారులు అంచనా వేసుకుంటే ఒక్కో ఉద్యోగికి 40 నుంచి 60 లోపే పింఛన్లు వస్తాయి. వారు ఇళ్లకు వెళ్లి రెండు రోజుల్లో పంపిణీ పూర్తిచేయవచ్చు. గత నెలలో ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులు బయటకు రాకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టారు. వెల్ఫేర్ సెక్రటరీ సహకారంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలువ ఈ తీరు.. పారేది కన్నీరు
[ 21-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది. -
ముందే గుంతలు.. కళ్లకు గంతలు..
[ 21-05-2024]
గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు కనీస మరమ్మతులు లేక గుంతలమయంగా మారాయి. నగరపాలక సంస్థ ఎదురుగా ఈ పరిస్థితి ఉన్నా అధికారులకు కనిపించడం లేదు. -
బాధ చూడరు.. బాగు చేయరు..
[ 21-05-2024]
జీజీహెచ్ అత్యవసర కేంద్రం నుంచి ఇలా రోగులను స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నది సీటీ స్కాన్ కేంద్రానికి. -
వైకాపా నాయకులకు గుణపాఠం చెప్పాలి
[ 21-05-2024]
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ ఘటనలో మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి ప్రమేయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. -
ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షణ
[ 21-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షించేలా బృందాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. -
న్యాక్ గ్రేడ్కు నిరీక్షణ!
[ 21-05-2024]
వర్సిటీలో బోధన, పరిశోధన ఎలా జరుగుతుందో పరిశీలించి ఐదేళ్లకు ఒకసారి న్యాక్ సంస్థ విశ్వవిద్యాలయాలకు గ్రేడ్ కేటాయిస్తుంది. -
గుంటూరు పశ్చిమ పోస్టల్ బ్యాలట్ల గది మార్పు
[ 21-05-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ల గదిని అధికారులు ఎట్టకేలకు మార్చారు. ఈ నెల 19వ తేదీన ‘ఈనాడు’ లో ‘పోస్టల్ బ్యాలట్లకు భద్రత ఏది’... శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎన్నికల అధికారుల్లో కదలిక వచ్చింది. -
జాతీయ సేవకుల కోసం
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్ సర్వీసెస్ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్(సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. -
తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి
[ 21-05-2024]
పార్టీ మారాడనే కోపంతో తెదేపా కార్యకర్తపై క్రికెట్ బ్యాట్తో వైకాపా వర్గీయులు దాడి చేశారు. శావల్యాపురం మండలం కిష్ణాపురంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. -
బాధితులు తెదేపా వారని.. ఇంత పక్షపాతమా?
[ 21-05-2024]
జిల్లాలోనూ సార్వత్రిక పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లోనే తెదేపా ఏజెంట్లను చితకబాదిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగుజూస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలో ఏ కొద్దిపాటి గొడవ జరిగినా అక్కడ ఉండే పీవో తన డైరీలో నమోదు చేయాలి. -
ఆ దారి.. మృత్యు వారధి
[ 21-05-2024]
కనిపించని సూచిక బోర్డులు.. ప్రమాదకర మలుపులు.. చోదకుల మితిమీరిన వేగం.. వాహనదారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై నిలుపుతున్న వాహనాలు.. కారణం ఏదైనా.. వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. -
గ్రానైట్ ముడిరాయి లారీల పట్టివేత
[ 21-05-2024]
గుంటూరు విజిలెన్స్ సీఐ శ్రీహరి తన బృందంతో సోమవారం బల్లికురవ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. -
గుండ్లకమ్మ చుట్టూ ఇసుక దొంగలే
[ 21-05-2024]
ఇసుక దొంగలకు దోచిపెట్టేందుకే గుండ్లకమ్మ నది అన్నట్లు పరిస్థితి ఉందని, అనుమతి లేని తవ్వకాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్ అన్నారు. -
కొంతమంది పోలీసుల తీరుతోనే.. హింసాకాండ
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13వ తేదీ, తర్వాత రోజు పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు బృందం విచారణ చేసింది. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 21-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
ఆస్పత్రికి వెళ్తే దంపతులపై విరిగిపడిన చెట్టు.. భర్త మృతి
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి
-
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!