క్రికెట్‌ ఆడుతుండగా కుప్పకూలిన టెకీ

క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేంద్రనగర్‌ సీఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల మేరకు....

Updated : 11 Aug 2022 06:29 IST


తుషార్‌

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేంద్రనగర్‌ సీఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.... గుజరాత్‌కు చెందిన తుషార్‌అన్వారా బెడ్వా(32)సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ కొన్ని సంవత్సరాలుగా బండ్లగూడజాగీర్‌లో నివసిస్తున్నాడు. రోజు సాయంత్రం 5గంటల సమయంలో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లి రాత్రి 7గంటలకు తిరిగి వెళ్తుంటాడు. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి బయలుదేరాడు. రాత్రి 8 అయినా ఇంటికి రాకపోవడంతో భార్య పూజ భర్త చరవాణికి ఫోన్‌ చేసింది. అతడి స్నేహితుడు మాట్లాడుతూ.. తుషార్‌ క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు చెప్పాడు. వెంటనే పూజ ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుకు గురై మరణించినట్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని