logo

దూసుకొచ్చిన మృత్యువు

నగర పంచాయతీ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ ఎస్‌ఐ తిమోతి చెప్పిన సమాచారం మేరకు.. మైలవరం మండలం తొర్రివేములకు చెందిన

Published : 24 May 2022 06:27 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి 

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: నగర పంచాయతీ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ ఎస్‌ఐ తిమోతి చెప్పిన సమాచారం మేరకు.. మైలవరం మండలం తొర్రివేములకు చెందిన శ్రీకాంత్, మధుసూదన్, కన్నెలూరులో నివాసముంటున్న సంజీవరెడ్డి ముగ్గురు సోమవారం  శేషారెడ్డిపల్లె నుంచి బైపాస్‌ దాటుతుండగా ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది. శ్రీకాంత్‌ (18) అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని