ఆరోగ్య సమాచారం.. సమస్తం నిక్షిప్తం
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సర్కారు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడంతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది. అసాంక్రమిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్
ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్న ఆశా కార్యకర్తలు
చిన్నారికి టీకా వేస్తున్న ఆశా కార్యకర్త (పాతచిత్రం)
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సర్కారు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడంతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది. అసాంక్రమిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు ప్రతి నెలా ఉచిత చికిత్సతో పాటు మందులు పంపిణీ చేస్తున్నారు.
తాజాగా ప్రతి కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. కుటుంబాల్లో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ‘ఆశా డిసీజ్ ప్రొఫైల్’ యాప్ను రూపొందించారు. దీనికి సంబంధించి ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. జిల్లాలోని రామగుండం నగరపాలకసంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, 266 పంచాయతీల్లో ఆశా కార్యకర్తలు మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వేతో ఏయే వ్యాధిగ్రస్థులు ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తేలనుంది. జిల్లాలో ఇంటింటా ఆరోగ్య సర్వే తుది దశకు చేరింది.
సర్వే ఎందుకంటే..
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వైద్య సేవలందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నాయి. వాటి ఆధారంగా చికిత్స, మందులు అందిస్తున్నారు. కాగా పుట్టిన పిల్లలు కూడా వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు అందిస్తున్నారు. అయితే కొన్ని రకాల వ్యాధులకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుండటంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. అలాగే పలు వ్యాధులకు సంబంధించి మందులు అరకొరగా కేటాయిస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏ వ్యాధితో ఎంత మంది బాధ పడుతున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే దోహదపడనుంది.
నెలాఖరులోగా పూర్తి..
జిల్లాలో 6 పట్టణ, 18 గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో 506 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా కుటుంబాల వివరాలు యాప్లో నమోదు చేసేందుకు ఆశా కార్యకర్తలకు యూజర్ ఐడీ, పాస్వర్డు కేటాయించారు.
* ప్రతి ఇంటికీ వెళ్లిన ఆశా కార్యకర్త కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నారో తెలుసుకుంటారు. వారి ఆధార్ వివరాలు నమోదు చేసుకుంటారు. క్షయ, క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, దగ్గు, దమ్ము, హృదయ, కాలేయ సంబంధిత వ్యాధులు, రక్తహీనత తదితర రుగ్మతలకు సంబంధించి బాధితుల వివరాలు నమోదు చేస్తున్నారు.
* కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మద్యపానం, పొగ, గుట్కా, జర్దా వంటి వ్యసనాలున్నాయా? అనే వివరాలు నిక్షిప్తం చేసుకుంటారు. కుటుంబ యజమాని స్థితిగతులు, ఆదాయం, కుళాయి కనెక్షన్, రేషన్కార్డు, పాన్కార్డు, ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారా? చదువు, ఉద్యోగాల వివరాలు పొందుపరుస్తున్నారు.
* జిల్లాలో ఇప్పటివరకు 4,76,506 మంది వివరాలను నమోదు చేశారు. మరో లక్ష మంది వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంది. వీటిని నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కొవిడ్ వ్యాక్సినేషన్, గర్భిణులు, బాలింతలకు పరీక్షలు జరిపించడం, పిల్లలకు టీకాలు వేయించాల్సి ఉండటంతో ఈ సర్వేతో తమపై పని భారం పెరుగుతుందని ఆశా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
అందుబాటులో ఆరోగ్య స్థితిగతులు ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో
జిల్లాలో ‘ఆశా డిసీజ్ ప్రొఫైల్’ యాప్లో వివరాల నమోదు జోరుగా సాగుతోంది. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుటుంబంలోని సభ్యులందరి ఆరోగ్య వివరాలు పొందుపరుస్తున్నారు. ఈ సర్వే పూర్తయితే ఆరోగ్య స్థితిగతులు సులువుగా తెలుసుకునే వీలుంటుంది. నెలాఖరులోపు సర్వే పూర్తి చేసేందుకు సిబ్బందిని సమన్వయం చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!