మినీ స్టేడియం పనుల పూర్తికి ఆదేశం
సిరిసిల్లలో మినీ స్టేడియం పనులను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాన్ని మంగళవారం కలెక్టర్
గుత్తేదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల పట్టణం, న్యూస్టుడే: సిరిసిల్లలో మినీ స్టేడియం పనులను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా రూ.3 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో మినీ స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే వారం రోజుల్లో ఆర్చి, సీసీరోడ్డు, వాకింగ్ ట్రాక్ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్చి నిర్మాణ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
వ్యవసాయ పరికరాల కేంద్రం ఏర్పాటుకు చర్యలు
ముస్తాబాద్, న్యూస్టుడే: వ్యవసాయ అద్దె పరికరాల కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ అద్దె పనిముట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ మంగళవారం సందర్శించారు. పరిసరాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు, ఐకేపీ సిబ్బందికి తగు సూచనలు చేసి సలహాలు అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కేంద్రానికి ఒక ట్రాక్టర్, రొటోవేటర్, రౌండ్ బాలెర్ల పరికరాలు వచ్చినట్లు పేర్కొన్నారు. (కస్టమ్ హైరింగ్ సెంటర్) వ్యవసాయ అద్దె పనిముట్ల కేంద్రం త్వరలో ఏర్పాటు చేయనున్నందున్న వీటిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సందేహలు ఉంటే ఎల్లారెడ్డిపేటలోని కేంద్రం నిర్వాహకుల ద్వారా తగు సూచనలు, సలహాలు పొందాలని పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించాక అదనంగా పరికరాలు అవసరమైతే ప్రతిపాదనలు పంపిస్తే సమకూర్చడానికి తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, వ్యవసాయ అధికారి వెంకటేశ్, ఏపీవో ఆనంద్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు