అయ్యో పాపం... ఎంతఘోరం!
మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆ స్నేహితులు పరీక్షలు ముగియగానే సెలవులను ఆనందంగా గడపాలని భావించారు. గురువారం వేసవి తాపానికి ఈత కొడదామని వెళ్లారు. చెరువే మృత్యు రూపంలో వారిని
చెరువులో మునిగి ఇద్దరు స్నేహితుల మృతి
గంభీరావుపేట, న్యూస్టుడే: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన ఆ స్నేహితులు పరీక్షలు ముగియగానే సెలవులను ఆనందంగా గడపాలని భావించారు. గురువారం వేసవి తాపానికి ఈత కొడదామని వెళ్లారు. చెరువే మృత్యు రూపంలో వారిని బలిగొనడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే... గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చిన్న కర్రోల్ల లక్షి- వెంకటిలకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు రవితేజ గంభీరావుపేట జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశాడు. అదేవిధంగా మహ్మద్ గౌసియ- షకిల్లకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు సమీర్ గంభీరావుపేటలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశాడు. సమీర్, రవితేజ ఇద్దరు ప్రాణస్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లేవారు. పరీక్షలు ముగియటంతో సరదాగా ఈత కొడదామని గురువారం గంభీరావుపేటలోని నమాజ్ చెరువుకు వెళ్లారు. వీరితోపాటు స్నేహితుడు రేవంత్, సమీర్ తమ్ముడు చాంద్లు కూడా వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. మొదట ఒడ్డునే ఉండి ప్లాస్టిక్ బాటిళ్ల సహాయంతో సమీర్, రవితేజలు ఈత కొట్టారు. బాటిళ్లు లేకుండా కొద్దిగా ముందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు మునిగిపోతున్నారు. వారిని చూసిన బయట ఉన్న ఇద్దరు కాపాడే ప్రయత్నం చేశారు. సమీర్ తమ్ముడు చాంద్ చాలా ప్రయత్నం చేశాడు. అటుగా వెళుతున్న వారి సాయం కోరినప్పటికి వారు సైతం వీరిని లోతుకు వెళ్లవద్దని వారించారు. వెంటనే గ్రామంలోకి చేరుకుని విషయం చెప్పారు. యువకులు చేరుకుని ఎంత వెతికినా ఇద్దరి ఆచూకీ దొరకలేదు. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని జాలర్లను పిలిపించారు. సాయంత్రం అయిదు గంటల వరకు గాలించగా రెండు మృతదేహాలు లభించాయి. గ్రామంలో విషాదంలో నెలకొంది. ఇద్దరి మృతితో వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. రవితేజ తండ్రి వెంకటి గల్ఫ్లో ఉండగా, సమీర్ తండ్రి షకిల్ ముంబయిలో ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్షకు సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి సీఐ మొగిలి పరిశీలించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని సీఐ తెలిపారు. చెరువులు నిండి ఉన్నాయని, బయటకు పంపించవద్దని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా