ప్రతిభ ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు
మంత్రి గంగుల కమలాకర్
మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ సంక్షేమ విభాగం, న్యూస్టుడే: గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పైరవీ చేస్తేనే వచ్చేవని ఇప్పుడు పైరవీలకు కాదు ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతిగృహా విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి వేసవి సాంస్కృతిక పోటీ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ కేవలం వెయ్యి ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చేవారని ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. మౌఖిక పరీక్షలు లేవని రాత పరీక్షకే మార్కులని చెప్పారు. కష్టపడి చదవాలని బీసీ బిడ్డలకే అధికంగా ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం తొమ్మిది బీసీ గురుకులాల్లో 16వేల మంది విద్యార్థులు చదువుకోగా నేడు 282 గురుకులాల్లో 1.52 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థినులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆర్వీ. కర్ణన్, నగర మేయర్ సునీల్రావు, కమిషనర్ సేవ ఇస్లావత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్ పాల్గొన్నారు.
తూకం వేయగానే రసీదు ఇవ్వాలి
భగత్నగర్ : రైస్ మిల్లర్లు ధాన్యం వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. శనివారం కరీంనగర్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ధాన్యాన్ని తూకం వేసి వెంటనే రసీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్, మేయర్ వై.సునీల్రావు, అదనపు పాలనాధికారి గరిమా అగ్రవాల్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి సురేశ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM KCR: హైదరాబాద్లో మరో కీలక ఘట్టం... టీహబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
India News
Sanjay raut: సంజయ్ రౌత్కు ఈడీ మళ్లీ సమన్లు
-
Business News
Mukesh Ambani: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
10th Results: తెలంగాణలో ఈనెల 30న పదో తరగతి ఫలితాలు
-
Politics News
Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభం వేళ.. కార్యాచరణ సిద్ధం చేస్తోన్న భాజపా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్బాబు
- ఆవిష్కరణలకు అందలం
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!