కాసులే లక్ష్యం.. కేసులే సాక్ష్యం
గతంలో ఆర్టీఏ అధికారులకు జిల్లా మొత్తంగా కలిపి సుమారుగా రూ.10 లక్షలను జరిమానాల రూపంలో ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంగా ఉండేది. కాని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా అందిన ఆదేశాల మేరకు ఒక్కో వెహికల్ ఇన్స్పెక్టర్కు రూ.6లక్షలను లక్ష్యంగా నిర్ణయించారు.
రోడ్లపై పెరిగిన పోలీసు, ఆర్టీఏల తనిఖీలు
ఈనాడు, కరీంనగర్
* ఇలా.. నగరంలో గడిచిన కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు రెండు మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. సుమారు 10-15 మంది సిబ్బంది ఇరువైపులా వెళ్లే ద్విచక్రవాహనదారుల్ని ఆపుతూ ధ్రువపత్రాల్ని పరిశీలిస్తున్నారు. ఏ ఒక్క పత్రం సరిగ్గా లేకున్నా ఈ-చలాన్లతో జరిమానా విధిస్తున్నారు. ఆయా కార్యాలయాలకు.. విధులకు వెళ్లే సమయంతోపాటు సాయంత్రం వేళల్లో ఈ తరహా పరిశీలనల్ని చేపడుతున్నారు. రద్దీగా ఉన్న మార్గాల్లో పహారా కాస్తూ కేసుల్ని నమోదు చేస్తున్నారు. ఓ వైపు కెమెరాలతో ఆయా కూడళ్ల వద్ద కాపుకాస్తూ శిరస్త్రాణం లేనివారిని ఫొటో తీస్తూనే మరోవైపు వాహనాల్ని ఆపుతూ తమదైన తరహాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
* గతంలో ఆర్టీఏ అధికారులకు జిల్లా మొత్తంగా కలిపి సుమారుగా రూ.10 లక్షలను జరిమానాల రూపంలో ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంగా ఉండేది. కాని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా అందిన ఆదేశాల మేరకు ఒక్కో వెహికల్ ఇన్స్పెక్టర్కు రూ.6లక్షలను లక్ష్యంగా నిర్ణయించారు. అంటే రోజుకు కనీసం రూ.20 వేల జరిమానాలను వాహనదారులకు విధించాలి. ఇదంతా వారికి అంతర్గతమైన విషయం. పైకి మాత్రం వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామనేలా నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న బండ్లను గుర్తిస్తున్నామనేలా వాటిని ఆపుతూ ఆయా పత్రాల పరిశీలన సహా అధిక లోడు ఇతర వివరాల్ని అడిగి ఏ ఒక్కటి లేకున్నా కేసు కడుతున్నారు. వాస్తవానికి రవాణా శాఖ నిబంధనలను పక్కాగా అమలు చేసే బాధ్యత పోలీసులది.. రవాణా శాఖ అధికారులదే అయినా.. ఇటీవల మాత్రం వీరి తనిఖీల చర్యలు పలురకాలుగా అడుగడుగునా కనిపిస్తున్నాయి. వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 82,929 కేసుల్ని వాహనదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలో భాగంగా నమోదు చేశారు. ఇందులో శిరస్త్రాణం ధరించనందుకు 66వేలకుపైగా ధ్రువపత్రాలు లేనివి దాదాపుగా 8వేల మందికి రుసుము చెల్లించాలనేలా సందేశాల్ని పంపించారు. గతేడాది చివరి నాటికి 5,14,612 మందికి శిరస్త్రాణం లేని కారణంగా రూ.9కోట్ల జరిమానా విధించారు. అక్రమంగా ఇసుక, మట్టిని తరలిస్తున్న వాహనాల్ని పట్టుకుంటున్నారు. 2019లో 32 కేసులు నమోదు చేసి 30 లారీలు, 5 టిప్పర్లు, 10 జేసీబీలు, 477 ట్రాక్టర్లు సహా మరో 10 వాహనాల్ని పట్టుకున్నారు. 2020లో 31 కేసుల్లో 12 లారీలు, 2 టిప్పర్లు, 4 జేసీబీలు 1001 ట్రాక్టర్లు ఇతర వాహనాలు మరో 25 స్వాధీన పర్చుకున్నారు. 2021లోనూ 41 కేసులకుగానూ 772 ట్రాక్టర్లు, 28 లారీలు సహా మరో 30 బండ్లను అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ ద్వారా 2021-22లో కేవలం తనిఖీల ద్వారా రూ.3.52కోట్ల ఆదాయం సమకూరగా. ఈ వార్షిక సంవత్సరంలోనూ దాదాపుగా రూ.4కోట్ల రాబడి రానుంది.
అవగాహన మంత్రమేది..?
అక్రమ రవాణాలను పట్టుకునే విషయంలో కేసుల తీరు సమంజసంగానే ఉన్నా.. ద్విచక్రవాహనదారులకు విధించే జరిమానాల విషయంలోనే ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏ ఒక్క ధ్రువపత్రం లేకున్నా వెంటనే రుసుము చెల్లించాలనేలా సందేశాలు వస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం అవగాహన కల్పించడం లేదా.. సంబంధిత ధ్రువపత్రాలు తీసుకునేందుకు ఒక్క అవకాశమిచ్చి వదిలేసేలా ఏ ఒక్క చోట కూడా పోలీసులు కనికరించడంలేదనేది వాస్తవం. ముఖ్యంగా వాహన బీమా పత్రం లేని వారికి కూడా ఏకంగా రూ.వెయ్యి కట్టాలని ఈ-చలనాలో వివరాల్ని నమోదు చేస్తున్నారు. అసలు ఈ పత్రాన్ని పొందేందుకు ఏడాదికి కూడా దాదాపుగా అంతే రుసుముంటుంది. మరోవైపు పోలీసులు గతంలో మాదిరిగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న దాఖలాలు జిల్లాలో కనిపించడం లేదు. రోడ్డు భద్రత సమయంలోనూ నామమాత్రపు కార్యక్రమాలుంటున్నాయి. చోదకులను తనిఖీ చేసే బాధ్యత ఎంత ఉంటుందో అదే స్థాయిలో వారికి రవాణా నిబంధనలు, ఇతరత్రా విషయాల్ని తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మాకుండే లక్ష్యాలు మాకుంటాయని పోలీసులు బాహాటంగానే పెదవి విరుస్తుండటం కేసుల నమోదు విషయంలో ఉన్న ఇబ్బందిని చెప్పకనే చెబుతోంది. వీటి పరంగా ఒత్తిడి అధికమవుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి చెప్పడం కొసమెరుపు.!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ