వ్యాధుల కాలం.. అవగాహనతో రక్ష
వేసవి తర్వాత వచ్చే వానాకాలం వ్యాధులను మోసుకొస్తుంది. తొలకరి వర్షాల సమయంలో నీరు కలుషితం అవుతుంటుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడంతో చిన్నపిల్లలకు నీళ్ల విరేచనాలు అధికంగా అవుతుంటాయి. ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని
జిల్లాలో కొనసాగుతున్న నీళ్ల విరేచనాల నియంత్రణ పక్షోత్సవాలు
న్యూస్టుడే, మెట్పల్లి
ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తున్న వైద్య సిబ్బంది
వేసవి తర్వాత వచ్చే వానాకాలం వ్యాధులను మోసుకొస్తుంది. తొలకరి వర్షాల సమయంలో నీరు కలుషితం అవుతుంటుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడంతో చిన్నపిల్లలకు నీళ్ల విరేచనాలు అధికంగా అవుతుంటాయి. ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వ నివేదికలు పేర్కొంటున్నాయి. 2025 నాటికి చిన్నారుల మరణాల రేటును తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఈ నెల 13 నుంచి 27 వరకు నీళ్ల విరేచనాల నియంత్రణ పక్షోత్సవాలను నిర్వహిస్తోంది. జిల్లాలో ఐదు పురపాలిక సంఘాలు, 18 మండలాల్లోని 22 పీహెచ్సీల్లో 92,225 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్టు గుర్తించారు. పది రోజుల్లో దాదాపు 80 శాతం ప్యాకెట్లు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అవగాహన ఇలా..: జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చిన్నారులు నీళ్ల విరేచనాల బారిన పడకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి వారికి ఓఆర్ఎస్, జింక్ మాత్రలను అందిస్తున్నారు. నీళ్ల విరేచనాలు కలిగితే ఓఆర్ఎస్ పొడిని నీళ్లలో కలిపి ఎలా తాగించాలో వివరిస్తున్నారు. రెండో వారంలో చేతుల శుభ్రత ప్రాధాన్యతను, శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన కల్పిసస్తున్నారు. ఇటుక బట్టీలు, క్వారీ ప్రాంతాల్లో చిన్నారుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరణాల తగ్గింపే లక్ష్యంగా.. - డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, జగిత్యాల
నీళ్ల విరేచనాల వల్ల సంభవించే మరణాల తగ్గింపే లక్ష్యంగా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ నెల 13 నుంచి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు చిన్నారుల ఇళ్లకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచాం. చిన్నారుల తల్లిదండ్రులు వైద్య సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు