logo

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి

 సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, ఇప్పటికే  సాగునీరు, విద్యుత్తు కష్టాలు తీరాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. గురువారం జమ్మికుంటలో దళితబంధు యూనిట్‌ కింద శ్రీసాయి ట్రేడర్స్‌ను ప్రణాళిక సంఘం

Published : 24 Jun 2022 04:25 IST

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

యూనిట్‌ను ప్రారంభిస్తున్న వినోద్‌కుమార్‌ చిత్రంలో

జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి 

జమ్మికుంట, న్యూస్‌టుడే :  సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, ఇప్పటికే  సాగునీరు, విద్యుత్తు కష్టాలు తీరాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. గురువారం జమ్మికుంటలో దళితబంధు యూనిట్‌ కింద శ్రీసాయి ట్రేడర్స్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ బండ శ్రీనివాస్, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, తెరాస నియోజకర్గ ఇన్‌ఛార్జి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందుకు కొత్తపల్లి మడిరోడ్డు వైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. హరితహారంలో నాటిన మొక్కలను కాపాడాలన్నారు. జమ్మికుంట మున్సిపల్‌ ఛైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు,  కమిషనర్‌ కె.సమ్మయ్య,  పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని