విద్యుత్తు సమస్యలకు పరిష్కారమెప్పుడో?
చొప్పదండి మేజర్ గ్రామపంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారినప్పటికి విద్యుత్తు సమస్యలు పరిష్కారం కావడం లేదు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కేవలం కొన్ని సమస్యలకు పరిష్కారం
సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు (పాతచిత్రం)
చొప్పదండి, న్యూస్టుడే: చొప్పదండి మేజర్ గ్రామపంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారినప్పటికి విద్యుత్తు సమస్యలు పరిష్కారం కావడం లేదు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కేవలం కొన్ని సమస్యలకు పరిష్కారం చూపగా మరికొన్నింటిని గాలికొదిలేశారు. ప్రతీ ఏటా సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కార్యచరణ రూపొందిస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.
ఇళ్లపై తీగలు
పట్టణంలోని వినాయకనగర్, శ్రీరామ టాకీసు, మారుతీనగర్తో పాటు పలు కాలనీల్లో విద్యుత్తు తీగలు ఇళ్లపై ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వాటిని ఇళ్లకు సమీపంలో లేకుండా కొంచెం దూరంగా ఏర్పాటు చేయాలని ప్రజలు ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా ఫలితంలేకుండా పోతుంది. తమ ఇళ్ల నుంచి చేతికందేవిధంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు. ప్రధాన కూడళ్ల సమీపంలో పలు రకాల విద్యుత్తు తీగలు ఒకే స్తంబానికి ఉండటంతో సైతం పలు ప్రమాదాలకు నెలవుగా మారింది. కొంతమంది ఇంటిలోనే ఇనుప స్తంబాలు ఉండటంతో వారు భయంతో జీవిస్తున్నారు.
నూతన స్తంభాల జాడేదీ?
కొన్ని విద్యుత్తు స్తంభాల నుంచి కనెక్షన్లు తొలగించినప్పటికి వాటిని అక్కడి నుంచి తొలగించలేదు. విరిగిపోయిన స్తంబాల స్థానంలో కొత్తవి వేసినప్పటికీ పాతవి అలాగే ఉంటున్నాయి. పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో నూతన ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా కొత్త స్తంభాలను వేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కేవలం మొదటి నాలుగు వార్డుల్లో 30 చొప్పున నూతన స్తంభాలు వేసి చేతులు దులుపుకున్నారు. మిగతా వార్డుల్లో విద్యుత్తు స్తంభాలు లేక రాత్రిపూట అంధకారంలో ఉంటున్నారు.
దశల వారీగా..
- రజిత, ఇన్ఛార్జి కమిషనర్, పురపాలకసంఘం
పట్టణ ప్రగతిలో భాగంగా విద్యుత్తు సమస్యలన్నింటిని గుర్తించడం జరిగింది. వాటన్నింటిని దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. విద్యుత్తు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తాం. ఇప్పటికే వార్డుల వారీగా కావాల్సిన అవసరాలు, తీర్చాల్సిన సమస్యలపై సమావేశాలు నిర్వహించడం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్