అధ్యాపకుల ప్రచారబాట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు నిర్వహించే బడిబాట తరహాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపే లక్ష్యంగా జిల్లాలోని అధ్యాపకులు ప్రచారబాట పట్టారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇంటర్లో ప్రవేశాల పెంపే లక్ష్యం
న్యూస్టుడే, మెట్పల్లి
సారంగాపూర్లో అధ్యాపకుల ప్రచారం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు నిర్వహించే బడిబాట తరహాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపే లక్ష్యంగా జిల్లాలోని అధ్యాపకులు ప్రచారబాట పట్టారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన కాలపట్టికను ప్రకటించింది. ఈ నెల 20 నుంచి జులై 20 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు నమోదు చేసుకోవాలని, జులై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది.
ఇంటింటికీ తిరుగుతూ..
నోడల్ అధికారి సూచనల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరడంవల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. వాటికి సంబంధించి ముద్రించిన కరపత్రాలు అందిస్తూ ప్రచారం చేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గడంతో ప్రత్యక్ష తరగతులు సజావుగా జరుగుతాయని, చదువులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తే అవకాశాలు లేవని పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు నమోదు చేసుకోవాలని చెప్పడంతోపాటు వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. పదోతరగతి ఫలితాలు వెలువడిన వెంటనే కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకున్న విద్యార్థులు ఉత్తీర్ణులైతే వారి వివరాలను అంతర్జాలంలో నమోదు చేయనున్నారు.
మూడు వేల మందికి అవకాశం
జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, వృత్తి విద్యాకోర్సులు బోధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 3 వేలకు పైగా విద్యార్థులు చేరే అవకాశముంది. జిల్లాలో ఏప్రిల్లో నిర్వహించిన పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 11,826 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరి ఇళ్లకు వెళ్లి అధ్యాపకులు అవగాహన కల్పిస్తూ ప్రవేశాల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నారు.
నాణ్యమైన విద్య..
-నారాయణ, జిల్లా నోడల్ అధికారి, జగిత్యాల
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం. అధ్యాపకులు పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకోవడంవల్ల కలిగే ప్రయోజనాలు, అందించే నాణ్యమైన ఉచిత విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొంది వసతులను సద్వనియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అతడు చాలా సేపు బంతిని బౌండరీ దాటించలేకపోయాడు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్