నేటి నుంచి దళితబంధు లబ్ధిదారుల ఎంపిక
దళితబంధు పథకానికి 1500 మంది లబ్ధిదారులను ఈ నెల 28వ తేదీ నుంచి జులై 10 వరకు ఎంపిక చేసి 11న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
మంత్రి గంగుల కమలాకర్
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి
గంగుల కమలాకర్, చిత్రంలో ఎమ్మెల్యేలు బాలకిషన్, రవిశంకర్, సతీష్బాబు,
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ విజయ, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్
కరీంనగర్ సంక్షేమ విభాగం, న్యూస్టుడే: దళితబంధు పథకానికి 1500 మంది లబ్ధిదారులను ఈ నెల 28వ తేదీ నుంచి జులై 10 వరకు ఎంపిక చేసి 11న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్పర్సన్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,359 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 10,202మందికి యూనిట్లు మంజూరు చేశామని ఇంకా 3,357మందికి యూనిట్లు మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. దళితబంధు పథకంతో భవిష్యత్తు తరాలు ఉన్నత వర్గాలకు దీటుగా ఎదుగుతారని తెలిపారు. పథకం పారదర్శకంగా అమలు చేసినందుకు జిల్లా పాలనాధికారి ఆర్వీ.కర్ణన్ను మంత్రి అభినందించారు. జిల్లా పాలనాధికారి ఆర్వీ. కర్ణన్ మాట్లాడుతూ..హుజురాబాద్ నియోజకవర్గంలో 17,554 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు చెప్పారు.
యూనిట్లను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ రెడ్డిని జిల్లా పాలనాధికారి అభినందించారు. జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ... డెయిరీ యూనిట్ల లబ్ధిదారుల కోసం గేదెలను తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావాలన్నారు.
రెండు పడక గదుల ఇళ్ల పథకంపై సమీక్ష
మంత్రి గంగుల కమలాకర్ రెండు పడక గదుల ఇళ్ల పథకంపై సమీక్షించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 3వేలు, కరీంనగర్లో 1400, మానకొండూర్లో 891, చొప్పదండి నియోజకవర్గంలో 707 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా 789 నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్లో ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సమావేశం ఉందని జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిన లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో 707 ఇళ్లు మంజూరయ్యాయని ఇళ్ల నిర్మాణం మొదలైన వాటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. గంగాధర ఎక్స్రోడ్ వద్ద ఆర్అండ్బీ రోడ్లను బాగు చేయాలని కోరారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్బాబు మాట్లాడుతూ.. సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో 247 రెండు పడక గదుల ఇళ్లకు 243 పూర్తయినట్లు చెప్పారు. సైదాపూర్లో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో 30వేల రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా పట్టణంలో 1214, జమ్మికుంటలో 500 వీణవంక మండలంలో 59, ఇల్లందకుంటలో 50 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. సమావేశంలో కరీంనగర్ మేయర్ సునీల్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, సుడా ఛైర్మన్ జీవీ.రామకృష్ణా రావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, జిల్లా అదనపు పాలనాధికారులు గరిమాఅగ్రవల్, శ్యాంప్రసాద్లాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డపై కేసీఆర్
[ 10-05-2024]
భారాస అధినేత కేసీఆర్ రోడ్ షో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కరీంనగర్ తెలంగాణ చౌక్ ప్రాంతం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోగా కేసీఆర్ తన ప్రసంగంతో వారిలో ఉత్తేజం నింపారు.. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 69.5 శాతమే!
[ 10-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 7,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
‘రిజర్వేషన్ల రద్దు ప్రచారం ఓ కుట్ర’
[ 10-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పెద్ద కుట్ర అని భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు. -
మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దె దించాలి : సీపీఐ
[ 10-05-2024]
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకికవాదాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. -
కుల వృత్తులను కాపాడటంలో కాంగ్రెస్దే పైచేయి
[ 10-05-2024]
కులవృత్తులను కాపాడటంలో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్దే పైచేయి అని ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. -
వలసజీవి సంక్షేమానికి బాటలేయండి
[ 10-05-2024]
గల్ఫ్ ఏజెంటు మోసం చేశాడని ఇటీవల జగిత్యాలలో వందలాది మంది యువకులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. -
గీత దాటితే.. కటకటాలే!
[ 10-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో పాటు పోలింగ్కు ఆటంకం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. -
కరీంనగర్ జిల్లాలో రూ.16.92 లక్షల పట్టివేత
[ 10-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం రూ.16,92,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్బాబు
[ 10-05-2024]
అన్నివర్గాల సంక్షేమ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
రైతు భరోసా నిలిపివేయించింది ఆ పార్టీలే
[ 10-05-2024]
భాజపా, భారాసలకు రైతులపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని ప్రభుత్వ విప్ -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ నిఘా
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు