గడువు సమీపం.. లక్ష్యానికి దూరం
ప్రభుత్వానికి బియ్యం అప్పగించే విషయంలో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. కేటాయిస్తున్న ధాన్యం, తిరిగి అప్పగించాల్సిన బియ్యం పరిమాణంలో వ్యత్యాసాల వల్ల ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో అస్తవ్యస్తంగా సీఎంఆర్ ప్రక్రియ
బియ్యం అప్పగింతపై మిల్లర్ల నిర్లక్ష్యం.. 2 నుంచి ఎఫ్సీఐ తనిఖీలు
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
సుల్తానాబాద్ మిల్లులో బియ్యం రాశులు
ప్రభుత్వానికి బియ్యం అప్పగించే విషయంలో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. కేటాయిస్తున్న ధాన్యం, తిరిగి అప్పగించాల్సిన బియ్యం పరిమాణంలో వ్యత్యాసాల వల్ల ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది.
ఈ ఏడాది జూన్లో ఎఫ్సీఐ అధికారులు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం తీసుకున్న ధాన్యానికి అనుగుణంగా నిర్ణీత ప్రమాణాలతో కూడిన బియ్యాన్ని అప్పగించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో మిల్లర్లు సీఎంఆర్ ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం అత్యాధునిక యంత్రాలు సమకూర్చుకోవడంతో పాటు ధాన్యం అప్పగింతలో ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖ నిబంధనలు పాటించాలని, బియ్యాన్ని అక్రమంగా విక్రయించవద్దని ప్రభుత్వం షరతులు విధించడంతో తిరిగి జులై నుంచి సీఎంఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబరు 2 నుంచి ఎఫ్సీఐ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయనుండటంతో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.
సీఎంఆర్ కింద మర పట్టేందుకు సిద్ధంగా ధాన్యం బస్తాలు
పునర్వినియోగం.. గడువుపై ఒత్తిడి
మిల్లర్లు సీఎంఆర్ కింద తీసుకుంటున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. దళారుల వద్ద రేషన్ బియ్యాన్ని కిలోకు రూ.20కి కొనుగోలు చేసి సీఎంఆర్ కింద పౌరసరఫరాల శాఖకు పెడుతుండగా నాణ్యత లేదని ఎఫ్సీఐ అంగీకరించడం లేదు. యాసంగిలో కేవలం ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామని ఎఫ్సీఐ స్పష్టం చేయడంతో మిల్లర్లు ఖంగుతిన్నారు. అనంతరం ఉప్పుడు బియ్యం సేకరణకు అంగీకరించినప్పటికీ మిల్లుల్లో లెక్కలకు అనుగుణంగా ధాన్యం నిల్వలు లేవు. సీఎంఆర్ అప్పగింతకు నవంబర్ 30 వరకు గడువుండటం, ఎఫ్సీఐ అధికారుల తనిఖీలుండటంతో మిల్లర్లు వణికిపోతున్నారు. గడువు పెంచాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఎగవేతదారులపై చర్యలేవీ!
* నిబంధనల మేరకు సీఎంఆర్ కింద కేటాయించిన క్వింటాలు ధాన్యానికి మిల్లర్లు 67 కిలోల చొప్పున బియ్యాన్ని ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖలకు అప్పగించాలి. ధాన్యాన్ని మర ఆడించినందుకు ప్రభుత్వమే మిల్లింగ్ ఖర్చులు చెల్లిస్తుంది.
* గత వానాకాలం, యాసంగి సీజన్లలో సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 402 మిల్లులకు అప్పగించింది. మిల్లర్లకు ధాన్యం కేటాయింపు పక్రియలో పౌరసరఫరాల శాఖ ఎలాంటి పూచీకత్తు తీసుకోదు. కేవలం వారితో ఒప్పంద పత్రం మాత్రమే రాయించుకుంటోంది.
* దీంతో సీఎంఆర్ ఎగవేస్తున్న మిల్లర్లపై ప్రభుత్వం చట్టప్రకారంగా చర్యలు తీసుకోలేకపోతోంది. చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న మిల్లర్లు మరాడించిన బియ్యాన్ని బహిరంగ విపణిలో కిలోకు రూ.30 చొప్పున విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
* మిల్లుల్లో బియ్యం బస్తాలను అస్తవ్యస్తంగా వేయడం, కుప్పలుగా పోయడంతో తనిఖీలు చేయడం సాధ్యం కాలేదు. నిల్వలు తక్కువగా ఉన్న మిల్లుల వివరాలు ఇచ్చి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎఫ్సీఐ పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసినా నోటీసులతో సరిపెడుతున్నారు.
పేరుకుపోతున్న నిల్వలు
* ఉమ్మడి జిల్లాలో 2021-22 వానాకాలంలో 1,400 కేంద్రాల్లో రూ.2 వేల కోట్ల విలువైన 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు.
* క్వింటాలుకు 67 కిలోల చొప్పున 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించారు. కేవలం 48 శాతం మాత్రమే సీఎంఆర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ సీజన్కు గాను సుమారు 5.5 లక్షల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది.
* 2021-22 యాసంగిలో మొత్తం 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి మిల్లులకు తరలించగా 4.94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. అంటే 38 శాతం మాత్రమే పూర్తి చేశారు. 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అప్పగించాల్సి ఉంది.
* పాత బియ్యం అప్పగించకముందే ఈ వానాకాలానికి సంబంధించి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,250 కేంద్రాల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 130 మిల్లులకు తరలించారు.
* ఇప్పటికే ఉన్న పాత నిల్వలు, కొత్తగా చేరిన ధాన్యంతో మిల్లులు నిండిపోయాయి. సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల ప్రాంతాల్లో మిల్లుల ఆవరణల్లోని ఖాళీ స్థలంలోనూ బస్తాలు వేశారు.
బకాయి లేని మిల్లులకే కేటాయింపు
-వెంకటేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పెద్దపల్లి
గతంలో కేటాయించిన సీఎంఆర్ పూర్తిగా అప్పగించిన మిల్లులకే ఈ వానాకాలంలో ధాన్యాన్ని కేటాయిస్తున్నాం. డిసెంబరు 2 నుంచి ఎఫ్సీఐ అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. బియ్యం అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM