కంప్యూటర్లు మూలకే!
పల్లెల్లో ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో పారదర్శకత, కాగిత రహిత సేవలందించాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. గతంలో ఎంపిక చేసి క్లస్టర్ పంచాయతీలకు కంప్యూటర్లు అందించి మూలన పడేయగా, ప్రస్తుతం ప్రతి పంచాయతీలో ఆన్లైన్ సేవలందించేందుకు ఫైబర్ నెట్ సేవలు ప్రారంభానికి నోచుకోవడంలేదు.
మండల కేంద్రాల నుంచే గ్రామ పంచాయతీల ఆన్లైన్ సేవలు
న్యూస్టుడే, సారంగాపూర్
మారుమూల పంచాయతీ భవనంపై ఏర్పాటు చేసిన సోలార్ పరికరం
పల్లెల్లో ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో పారదర్శకత, కాగిత రహిత సేవలందించాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. గతంలో ఎంపిక చేసి క్లస్టర్ పంచాయతీలకు కంప్యూటర్లు అందించి మూలన పడేయగా, ప్రస్తుతం ప్రతి పంచాయతీలో ఆన్లైన్ సేవలందించేందుకు ఫైబర్ నెట్ సేవలు ప్రారంభానికి నోచుకోవడంలేదు. జిల్లాలోని 380 పంచాయతీలను మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ప్రతి పంచాయతీకి ఫైబర్ నెట్ ద్వారా సేవలందించేందుకు రెండేళ్లుగా పనులు కొనసాగిస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లు సేవలందక మండలాలకే పరమితమవ్వగా, ప్రస్తుతం ఈ పంచాయతీ సేవలు ప్రజలకు అందడంలేదు. పంచాయతీ పాలనా అంతర్జాల సహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
చేతిరాత రసీదులే..
ప్రభుత్వం 2015లో క్టస్లర్ పంచాయతీలకు కంప్యూటర్లను పంపిణీ చేసింది. జిల్లాలో అత్యధికంగా జనాభా ఉన్న పంచాయతీలకు కంప్యూటర్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. మేజర్ పంచాయతీలు మినహా ఎక్కడా కంప్యూటర్ వినియోగంలో లేవు. అయితే కంప్యూటర్లు అందించినా ఆపరేటర్లను నియమించకపోవడంతో ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయి, పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో చెత్తకుప్పల్లో పడేశారు. పన్నులు, ఇతర సేవలకు రుసుము చెల్లిస్తున్న వారికి చేతిరాత రసీదులే ఇస్తున్నారు. ఇందులో ఎంత మొత్తం గ్రామ పంచాయతీ ఖాతాకు చేరుతున్నది ప్రశ్నార్థకంగా మారింది.
క్లస్టర్ వ్యవస్థ నిర్వీర్యం
జిల్లాలో 380 పంచాయతీలు ఉండగా, ఎంపిక చేసిన గ్రామాలను క్లస్టర్ పంచాయతీలుగా విభజించారు. ఆయా క్లస్టర్ పంచాయతీలకు అందించిన పలు కంప్యూటర్లను మండల పరిషత్తు కార్యాలయాలకు తీసుకువచ్చి మండలానికి ఇద్దరు చొప్పున ఆపరేటర్లను నియమించి నిధుల వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 54 మంది వరకు ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఆపరేటర్ కొన్ని గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. వీరికి వేతనాలు ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి 5 నుంచి 10 శాతం చెల్లిస్తున్నారు. అంతేకాకుండా మండల పరిషత్తుకు సంబంధించిన ప్రగతి పనుల సమాచారాన్ని వీరే కంప్యూటర్లో నిక్షిప్తం చేయాల్సి వస్తోంది. ఈ పంచాయతీ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో ప్రవేశపెట్టిన క్లస్టర్ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా పంచాయతీ వివరాలు పొందుపర్చడానికి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో ఇతరత్రా కాగితాలకు మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.
పల్లె సాంకేతికత పూర్తయ్యేదెప్పుడు?
జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు డిజిటల్ సేవలందించేందుకు ప్రభుత్వం ఫైబర్ లైన్ ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల ద్వారా ప్రతి పల్లెకు కేబుల్ లైన్ వేశారు. జిల్లాలో 18 మండలాల్లోని(పాత) 380 పంచాయతీలు ఉండగా వీటన్నింటికి అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ లైన్ వేశారు. ఇతర గ్రామాల నుంచి ఫైబర్ నెట్ సేవలను అందించేందుకు అనుసంధానం చేశారు. ప్రతి పంచాయతీల సామగ్రితోపాటు సోలార్తో పనిచేసేలా యంత్రాలను బిగించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాంకేతిక సేవలందక ప్రజలు ఎదురు చూడాల్సి వస్తోంది.
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సామగ్రి
ఇబ్బందుల్లేకుండా..
- శశికుమార్రెడ్డి, మండల పంచాయతీ అధికారి
ప్రజలకు ఇబ్బందుల్లేకుండా పారదర్శంగా ఆన్లైన్ సేవలు కొనసాగిస్తున్నాం. మండల స్థాయిలోని కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా ఆదాయ, వ్యయ వివరాలను నమోదు చేస్తున్నాం. దీనిద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ల ద్వారా ప్రతి పంచాయతీ వివరాలను చూసుకునే అవకాశముంది. నూతనంగా పంచాయతీలలో ఏర్పాటు చేస్తున్న ఫైబర్ నెట్ సేవలు ప్రారంభం కానున్నాయి.
ప్రజలకు ఇబ్బంది..
-జమున, సర్పంచి, కోనాపూర్
ప్రభుత్వం అందించిన నిధులు, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆన్లైన్ చేయాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. గతంలో అందించిన కంప్యూటర్లు మూలన పడేయగా, ప్రస్తుతం ఫైబర్ నెట్ సేవలు ఇప్పటికీ ప్రారంభం కావడంలేదు. పంచాయతీల ద్వారానే మండలంలో నియమించిన కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. ప్రజల్లో అధునిక సాంకేతికత పెరుగుతున్నా.. పంచాయతీల్లో మాత్రం పాత పద్ధతి వినియోగించుకోవాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.