మాజీ మావోయిస్టు అరెస్టు
మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, పేలుడు పదార్థాలను చేరవేస్తున్న మాజీ మావోయిస్టును అరెస్టు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి తెలిపారు.
కాటారం, న్యూస్టుడే: మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, పేలుడు పదార్థాలను చేరవేస్తున్న మాజీ మావోయిస్టును అరెస్టు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్సై సుధాకర్, సీఆర్పీఎఫ్ సిబ్బంది మండలకేంద్రంలోని బొప్పారం క్రాస్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తూ పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకొన్నట్లు చెప్పారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో డీఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన పొలం రాజయ్య(48) మిషన్ భగీరథలో హెల్పర్గా పని చేస్తున్నాడు. 13 ఏళ్ల వయసులో పెద్దపల్లి ఏరియా దళంలో పనిచేశాడు. వివాహం అనంతరం దుమ్మాటి అర్జున్ అలియాస్ నాగన్న, అతని భార్య నిర్మల కమాండర్గా ఉన్న దళంలో చేరగా కంకణాల రాజిరెడ్డి ఆలియాస్ వెంకటేష్తో పరిచయం ఏర్పడింది. అనంతరం పాత వరంగల్, కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగన్ వద్ద ప్లాటూన్ కమాండర్గా చేరాడు. 2002లో లొంగిపోయిన రాజయ్య ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం కలిసిరాక ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో మళ్లీ పార్టీలో చేరాలనే ఉద్దేశంతో గతంలో పరిచయమైన మావోయిస్టు ప్రతినిధి రాజిరెడ్డిని నాలుగు నెలల కిందట ఫోన్లో మాట్లాడి మళ్లీ చేరేందుకు ఒప్పుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయసాగాడు. అప్పటి నుంచి భావజాలం ఉన్న వ్యక్తులను కలుస్తూ పార్టీలో చేరేలా ప్రోత్సహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజిరెడ్డి సూచన మేరకు మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై మావోయిస్టు సాహిత్య కరపత్రాలు, మందుగుండు సామగ్రిని తీసుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుకు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విప్లవ సాహిత్య కరపత్రాలు, నాలుగు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, చరవాణి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని రాజయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై సుధాకర్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా