సరికొత్తగా.. సర్కారు బడులు
జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి.
జిల్లాలో 15 చోట్ల సిద్ధం చేసిన అధికారులు
సిరిసిల్లలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల
న్యూస్టుడే, సిరిసిల్ల(విద్యానగర్), ఎల్లారెడ్డిపేట: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి. సర్కారు బడుల అభివృద్ధే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మొదటి విడతగా పలు పాఠశాలల్లో మూత్రశాలలు, డ్యూయల్ డెస్క్లు, గ్రీన్బోర్డులు తదితర కనీస సౌకర్యాలను కల్పించారు. దీంతో సర్కారు బడుల రూపురేఖలు మారిపోయాయి. వీటిని నేడు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అందుకు సిద్ధం చేశారు.
జిల్లాలో మొత్తం 511 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అనేక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకోగా మరికొన్నింటిలో కనీస సౌకర్యాలు మృగ్యమయ్యాయి. సర్కారు బడుల్లో అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన ఊరు- మన బడి కార్యక్రమంలో మొదటి విడతగా జిల్లాలో 172 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిని ఆధునికీకరించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పనులన్నీ పూర్తిచేసుకొని నేడు జిల్లాలోని 15 పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేశారు. విద్యుత్తు సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు, హ్యాండ్వాష్, ఫ్లోరింగ్, గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు గ్రంథాలయం, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లను నిర్మించారు. మొదటి విడత ఎంపిక చేసిన వాటిలో దాదాపు 60 పాఠశాలల్లో 60 నుంచి 70 శాతం పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని పనులు పూర్తయితే జిల్లాలోని మరికొన్ని పాఠశాలలను రెండో విడత కార్యక్రమానికి ఎంపిక చేయనున్నారు. పనులు వేగంగా సాగితే జిల్లాలోని సర్కారు బడులు నూతన శోభ సంతరించుకుని కార్పొరేట్కు దీటుగా మారనున్నాయి.
ప్రారంభోత్సవానికి సిద్ధమైన బండలింగంపల్లిలోని ప్రాథమిక పాఠశాల
పూర్తి చేసినవి...
బోయినపల్లి మండలంలోని అనంతపల్లి, చందుర్తి మండలంలోని జోగాపురం, చందుర్తి మండలంలోని రామారావుపల్లి, గంభీరావుపేట మండలంలోని గజసింగవరం, గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల, ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట, రుద్రంగి మండలంలోని మానాల అడ్డాబోరుతండా, రుద్రంగి ఎస్సీ కాలనీ, తంగళ్లపల్లి మండలంలోని ఆర్టిసన్ కాలనీ, వేములవాడ మండలంలోని చీర్లవంచ, వేములవాడ గ్రామీణం మండలంలోని మర్రిపల్లి ఎంపీపీఎస్లను సిద్ధం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, వేములవాడ మండలంలోని నాంపల్లి ఎంపీయూపీఎస్లను ప్రారంభించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. -
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన
[ 07-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతారాణి తెలిపారు. -
భాజపాశ్రేణుల్లో జోష్!
[ 07-05-2024]
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. -
ఇలాగైతే ఓటేసేదెలా?
[ 07-05-2024]
సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. -
ఇదీ మా ఎజెండా
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. -
భాజపాను ఇంటికి సాగనంపాలి
[ 07-05-2024]
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
ప్రచార ఖర్చులు విధిగా సమర్పించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. -
ఈవీఎం కమిషనింగ్ పూర్తి చేయాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ సోమవారం పరిశీలించారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
[ 07-05-2024]
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య