ప్రాణం తీసిన ఇసుక తరలింపు వివాదం
ఇసుక లారీల రాకపోకలతో పంటలు దెబ్బతింటున్నాయంటూ రైతు వాటిని అడ్డుకోగా ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో అతడి తండ్రి హఠాన్మరణం చెందిన ఘటన సుల్తానాబాద్ మండలంలో చోటుచేసుకుంది.
రీచ్ నిర్వాహకులతో గొడవ.. వృద్ధుడి హఠాన్మరణం
కనుకయ్య
సుల్తానాబాద్, న్యూస్టుడే: ఇసుక లారీల రాకపోకలతో పంటలు దెబ్బతింటున్నాయంటూ రైతు వాటిని అడ్డుకోగా ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో అతడి తండ్రి హఠాన్మరణం చెందిన ఘటన సుల్తానాబాద్ మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ వద్ద మానేరు వాగులో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక రీచ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుక తరలించే వాహనాలు తొగర్రాయి పంచాయతీ పరిధి జెండాపల్లికి చెందిన చెంచు శ్రీనివాస్ పొలం పక్క నుంచి వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఇసుక లారీల వల్ల దుమ్ము లేచి తమ పొలంలోని పంటలపై పడి దిగుబడులు తగ్గుతున్నాయని, రీచ్ నిర్వాహకులు కనీసం నీళ్లు కూడా చల్లించడం లేదని శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం లారీలను అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా ఇసుక రీచ్ నిర్వాహకులతో వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తండ్రి కనుకయ్య(60) ఘటనా స్థలానికి చేరుకొని కొడుకును దుర్భాషలాడుతున్న వారిని వారించాడు. వాగ్వాదం చోటుచేసుకొని కనుకయ్య శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకెళ్లారు. కొద్ది సేపటికి అతడు కుప్పకూలి మృతి చెందాడు. అప్పటికే చీకటి పడటంతో ఊరకుండిపోయిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయం మృతదేహాన్ని ఇసుక రీచ్ వద్దకు తరలించి ఆందోళన చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. మృతుడు కనుకయ్యకు భార్య కనుకమ్మ, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల జోక్యంతో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఇసుక రీచ్ నిర్వాహకులు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయమై సుల్తానాబాద్ పోలీసులను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా వృద్ధుడు మృతి చెందిన ఘటనపై తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ