కరాటే శిక్షణ.. బాలికలకు ఆత్మరక్షణ
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా బాలికలు, మహిళలపై దాడులు కొనసాగుతున్నాయి. బాలికల స్వీయ రక్షణ కోసం ప్రభుత్వం కరాటే శిక్షణ ఇవ్వడానికి చర్యలు చేపట్టింది.
జిల్లాలో వంద పాఠశాలల ఎంపిక
న్యూస్టుడే, గంభీరావుపేట
గంభీరావుపేట కస్తూర్బాలో శిక్షణ తీసుకుంటున్న బాలికలు
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా బాలికలు, మహిళలపై దాడులు కొనసాగుతున్నాయి. బాలికల స్వీయ రక్షణ కోసం ప్రభుత్వం కరాటే శిక్షణ ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. గతంలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వగా కరోనా సమయంలో దీనిని నిలిపివేశారు. ప్రస్తుతం ఈ నెల 4 నుంచి జిల్లా వ్యాప్తంగా బాలికలు అధికంగా ఉన్న పాఠశాలను గుర్తించి శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో కస్తూర్బా, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 100 ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో శనివారం నుంచి శిక్షణ ప్రారంభించగా నెల రోజుల పాటు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. 33 మంది శిక్షకులను ఎంపిక చేశారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేల వేతనం చెల్లించనున్నారు.
పెరగనున్న ఆత్మవిశ్వాసం
ప్రధానంగా బాలికలపై జరుగుతున్న అకృత్యాలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, విపత్కర పరిస్థితుల్లో రక్షించుకోవడానికి కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని జిల్లాల్లో గత నెలలో ప్రారంభించినప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరాటే శిక్షకులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గతంలో శిక్షణ ఇచ్చిన సీనియర్లతోపాటు మరికొందరిని తీసుకున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం విద్యార్థినులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఎంతో ఉపయోగం
కరాటే శిక్షణ తీసుకోవటం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కేవలం నెల రోజుల పాటు కాకుండా ప్రతి విద్యా సంవత్సరం మూడు నెలల పాటు ఇస్తే అందులోని మెలకువలను పూర్తిగా తెలుసుకోవచ్చు. ప్రతి విద్యా సంవత్సరం అందించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
భవనిత వర్ధిని, ఎనిమిదో తరగతి
పకడ్బందీగా నిర్వహణ
జిల్లాలో కరాటే శిక్షణను పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. నెల రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. పురుషులతో పాటు స్త్రీలు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో కరాటే శిక్షణను అందిస్తున్నాం. విద్యార్థి దశ నుంచి ఆత్మరక్షణ శక్తిని పెంపొందించేలా మార్పు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కరాటే శిక్షణ ఇవ్వటం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినుల సంఖ్య పెరుగుతుంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు ఇస్తున్నారు.
పద్మజ, జెండర్ అండ్ ఈక్విటీ జిల్లా సమన్వయకర్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ