భాషా పండితుల నిరసన.. నిలిచిన బోధన
జిల్లాలోని భాషా పండితులు, పీఈటీలు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాషా పండితుల కేసు కోర్టు పరిధిలో ఉంది.
9, 10 తరగతుల విద్యార్థులకు ఇబ్బందులు
న్యూస్టుడే, సిరిసిల్ల(విద్యానగర్)
డీఈవో రాధాకిషన్కు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
జిల్లాలోని భాషా పండితులు, పీఈటీలు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాషా పండితుల కేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులు, పీఈటీలు తీవ్ర నిరాశలో పడ్డారు. ఏళ్లు గడుస్తున్నా పండితుల అప్గ్రేడేషన్ సమస్య అలానే మిగిలిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం అందించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత గానీ భాషా పండితుల సమస్యలు పరిష్కారం కాలేదు. తమకు కూడా ఇదే షెడ్యూల్లో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన బాట పట్టారు.
జిల్లాలో 95 హిందీ, 100 తెలుగు పండిట్లు, 46 మంది పీఈటీలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉన్న వారే టీచర్లుగా పాఠాలు బోధించాలి. గత కొన్నేళ్ల నుంచి ఉన్నత పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఉర్దూను గ్రేడ్-2 భాషా పండితులతో బోధిస్తూ పండితులను శ్రమ దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వేతనం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ఎన్జీటీలతో సమానంగా ఇస్తున్నారని, తమ వద్ద చదువుకున్న విద్యార్థులే ఉపాధ్యాయులుగా వచ్చి తమకే ప్రధానోపాధ్యాయులుగా మారుతున్నారని వాపోతున్నారు. పండిట్ గ్రేడ్-2గా పని చేసి ఎలాంటి పదోన్నతి లేకుండా ఉద్యోగ విరమణ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని భాషా పండితులు నిరసన బాట పట్టారు. జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సిరిసిల్లలో అంబేడ్కర్చౌక్లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ నెల 1 నుంచి భాషా పండితులు 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో భాషా పండితులు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వారికి సిలబస్ పూర్తయినప్పటికీ సందేహాల నివృత్తికి భాషా పండితులు అందుబాటులో లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. 9వ తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తికాలేదు.
బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్న భాషా పండితులు
హిందీ ఉపాధ్యాయులు లేక..
కు హిందీ ఉపాధ్యాయులు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఓవైపు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో పాఠాల పునరుశ్ఛరణ, సందేహాల నివృత్తికి వారు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు మా సమస్యలను పరిష్కరించాలి.
మీనాక్షి, పదో తరగతి, జడ్పీహెచ్ఎస్, ఆవునూర్
సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి
భాషా పండితులందరినీ అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పిస్తామని ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. హామీ నెరవేరనందున పాఠశాలల్లో బోధన నిలిపివేశాం. భాషా పండితులను శ్రమ దోపిడీకి గురిచేయడం సరికాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలి. భాషా పండితులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలి.
గోనె బాల్రెడ్డి, రాష్ట్రీయ పండిత పరిషత్, జిల్లా అధ్యక్షుడు
పదోన్నతులు కల్పించాలి
ప్రభుత్వం భాషా పండితులు, పీఈటీలను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలి. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి.
ప్రభాకర్, పెటా జిల్లా అధ్యక్షుడు
పిల్లలు ఆందోళన చెందవద్దు
జిల్లాలోని భాషా పండితులు నిరసన బాట పట్టడంతో 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన నిలిచిపోయింది. పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తయింది. అందువల్ల ఇబ్బంది లేదు. సందేహాల నివృత్తి ఇతర ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దు.
డి.రాధాకిషన్, జిల్లా విద్యాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.