న్యాయవాదులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
డిజిటల్ లైబ్రరీతో న్యాయవాదులు వృత్తిలో మరింత రాణిస్తారని హైకోర్టు న్యాయమూర్తి (జిల్లా పరిపాలన) జస్టిస్ కన్నెగంటి లలిత అన్నారు.
మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత
చైతన్యపురి, న్యూస్టుడే: డిజిటల్ లైబ్రరీతో న్యాయవాదులు వృత్తిలో మరింత రాణిస్తారని హైకోర్టు న్యాయమూర్తి (జిల్లా పరిపాలన) జస్టిస్ కన్నెగంటి లలిత అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన డిజిటల్ లైబ్రరీ భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయమూర్తులు, న్యాయవాదులతోనే బాధితులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ చైతన్యవంతమైందని, జిల్లా పరిపాలన న్యాయమూర్తిగా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుల్లో డిజిటలైజేషన్కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ఇక్కడి వారు విదేశాల్లో కేసులు వాదించవచ్చని, అక్కడి వారు ఇక్కడివి వాదించవచ్చని, ఇది గొప్ప పరిణామమని అన్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉంటున్నాయని, మరో నాలుగు కోర్టులు మంజూరు చేయడంతోపాటు జూనియర్ సివిల్ జడ్జిలను నియమించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి పోర్టుపోలియో న్యాయమూర్తిని కోరారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డపై కేసీఆర్
[ 10-05-2024]
భారాస అధినేత కేసీఆర్ రోడ్ షో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కరీంనగర్ తెలంగాణ చౌక్ ప్రాంతం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోగా కేసీఆర్ తన ప్రసంగంతో వారిలో ఉత్తేజం నింపారు.. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 69.5 శాతమే!
[ 10-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 7,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
‘రిజర్వేషన్ల రద్దు ప్రచారం ఓ కుట్ర’
[ 10-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పెద్ద కుట్ర అని భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు. -
మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దె దించాలి : సీపీఐ
[ 10-05-2024]
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకికవాదాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. -
కుల వృత్తులను కాపాడటంలో కాంగ్రెస్దే పైచేయి
[ 10-05-2024]
కులవృత్తులను కాపాడటంలో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్దే పైచేయి అని ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. -
వలసజీవి సంక్షేమానికి బాటలేయండి
[ 10-05-2024]
గల్ఫ్ ఏజెంటు మోసం చేశాడని ఇటీవల జగిత్యాలలో వందలాది మంది యువకులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. -
గీత దాటితే.. కటకటాలే!
[ 10-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో పాటు పోలింగ్కు ఆటంకం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. -
కరీంనగర్ జిల్లాలో రూ.16.92 లక్షల పట్టివేత
[ 10-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం రూ.16,92,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్బాబు
[ 10-05-2024]
అన్నివర్గాల సంక్షేమ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
రైతు భరోసా నిలిపివేయించింది ఆ పార్టీలే
[ 10-05-2024]
భాజపా, భారాసలకు రైతులపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని ప్రభుత్వ విప్ -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ నిఘా
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా