నామమాత్రంగా వార్డు కమిటీలు
పాలకవర్గం, అధికార యంత్రాంగంతోపాటు పట్టణ వాసులను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం పురపాలికల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసింది.
సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలో కనిపించని చొరవ
పట్టణంలో మురుగు కాల్వ దుస్థితి
రాయికల్ పట్టణం, న్యూస్టుడే: పాలకవర్గం, అధికార యంత్రాంగంతోపాటు పట్టణ వాసులను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం పురపాలికల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసింది. వార్డుల్లో ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో, దాన్ని ఏవిధంగా పరిష్కరించాలో ప్రజల తరఫున పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారే వార్డు కమిటీ సభ్యులు. స్థానిక ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన వార్డు కమిటీలను అధికారులు పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పట్టణాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించాల్సిన వార్డు కమిటీలు కొంతకాలంగా నిస్తేజంగా ఉండిపోయాయి. దీంతో క్షేత్రస్థాయిలో వార్డుల్లో మౌలికవసతులకు సరైన ప్రణాళికలు నిర్వహించడం లేదు. రెండేళ్ల క్రితం వార్డు కమిటీలను నియమించినపుడు హడావుడి చేసినా ఆతర్వాత వార్డు కమిటీలు నామమాత్రం అయ్యాయి. పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కమిటీల పాత్ర లేకపోవడంతో సమస్యలు ప్రాధాన్య క్రమంలో పరిష్కారం కావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డు కమిటీలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు
వార్డుకు నాలుగు కమిటీలు ఉంటాయి. మొదటి కమిటీలో స్థానిక యువత, రెండో కమిటీలో మహిళలు, మూడో కమిటీలో విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటీజన్స్ నాలుగో కమిటీలో పుర ప్రముఖులు, మేధావులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఉంటారు. పట్టణంలో సుమారు 20 వేల జనాభా ఉండగా ఒక్కో వార్డుకు 4 కమిటీల వంతున 12 వార్డులకు మొత్తం 48 వార్డు కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. వీరితో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం జరిపి కమిటీ సభ్యుల సూచనలతో వార్డుల్లో పనులు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా వార్డు కమిటీ సభ్యులతో చర్చించి పాలకవర్గం ఆమోదించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. అందుకే ఆయా కమిటీల్లో ఎంపికైన వారు స్థానిక సమస్య పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి. ముఖ్యంగా అంతర్గత రోడ్ల నిర్మాణం, మురుగు కాల్వలు, వీధి దీపాల నిర్వహణ, రహదారుల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, సాధారణ మరమ్మతులు వంటి అంశాలను పరిష్కరించేందుకు వార్డు కమిటీ సమావేశాలు జరిపి వాటి పరిష్కారానికి పాలకవర్గం కృషి చేయాలి. కాని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కమిటీలు నామమాత్రమయ్యాయి.
బలోపేతం చేస్తాం
గత సంవత్సరం జూన్, డిసెంబర్ నెలల్లో వార్డు సమావేశం నిర్వహించి సభ్యుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాం. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిబంధనల మేరకే నిర్వహిస్తున్నాం. వార్డు కమిటీ సభ్యులను స్థానిక సమస్యల పరిష్కారంలో భాగస్వాములు చేయడంతోపాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తాం. వార్డు కమిటీలను బలోపేతం చేసి చైతన్యవంతంగా తీర్చిదిద్దుతాం.
గంగుల సంతోష్కుమార్, కమిషనర్, రాయికల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!