అడ్డగోలు బిల్లులు
కొండగట్టులో ఏటా నిర్వహించే ఆంజనేయస్వామి జయంత్యుత్సవాల్లో లక్షల్లో బిల్లులు చెల్లించడం, గుత్తేదార్లకు అధిక రేట్లకు పలు పనులు అప్పగించడం ఆరోపణలకు దారితీస్తోంది.
జయంత్యుత్సవాల్లో అంచనాకు మించి వ్యయం
న్యూస్టుడే, మల్యాల
అంజన్న ఆలయం
కొండగట్టులో ఏటా నిర్వహించే ఆంజనేయస్వామి జయంత్యుత్సవాల్లో లక్షల్లో బిల్లులు చెల్లించడం, గుత్తేదార్లకు అధిక రేట్లకు పలు పనులు అప్పగించడం ఆరోపణలకు దారితీస్తోంది. కొండగట్టు అంజన్న ఆలయంలో ఏప్రిల్ 6, మే 14న నిర్వహించిన హనుమాన్ జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి అధికారులు దాదాపు కోటి రూపాయలు వెచ్చించడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రివైజ్డ్ పేరుతో పనుల అప్పగింత
ఉత్సవాల్లో గతంలో పనిచేసిన గుత్తేదార్లకు పనులు అప్పగించడం ఆనవాయితీగా మారింది. తర్వాత ‘రివైజ్’ పేరుతో రేట్లను రెండు నుంచి మూడు రెట్లు పెంచుతూ తమకు అనుకూలంగా ఉండే గుత్తేదార్లకు మేలు చేస్తూ తద్వారా ప్రయోజనం పొందుతుంటారన్న ఆరోపణలున్నాయి. ఆలయానికి రంగులు వేయడానికి దాదాపు రూ.2 లక్షల వరకు వెచ్చించినట్లు చెబుతున్న అధికారులు ఈసారి ఏకంగా రూ.5 లక్షలకు అప్పగించినట్లు పేర్కొనడం విశేషం. నాలుగేళ్ల కిందట ఓ భక్తుడు ఆలయానికి రంగులు వేయడానికి రూ.2 లక్షలు విరాళం అందించినా అధికారులు గుత్తేదారుకు బిల్లులు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం.
విద్యుత్తు దీపాలంకరణకు రూ.12 లక్షలు
ఆలయానికి విద్యుత్తు దీపాలంకరణ, ఫ్లడ్లైట్ల నిర్మాణం, ఆలయ పరిసరాల్లో, ఘాట్రోడ్డు వెంట, కొండగట్టు స్టేజీ వద్ద విద్యుత్తు దీపాలతో దేవతామూర్తులు, ఇతర బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఏకంగా రూ.12 లక్షలు వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ పరిధిలో పలువురు దాతలు స్వచ్ఛందంగా భోజనాలు, మజ్జిగ, నీళ్ల సరఫరా చేసినప్పటికీ అధికారులు కూడా నీటి సరఫరా, తదితర పనుల కోసం లక్షల్లో బిల్లులు రూపొందించారు.
పారిశుద్ధ్యానికి రూ.12 లక్షలు!
కొండగట్టులో పారిశుద్ధ్య సమస్య భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం అధికారులు ఏకంగా రూ.12 లక్షల బిల్లులు రూపొందించి మంజూరుకు పంపించారు. ఆ అధికారి బిల్లులు చూసి అవాక్కయి తాను సంతకం చేయనని స్పష్టం చేయడంతో విషయం డీపీవో వరకు వెళ్లినట్లు సమాచారం.
తడికల పందిళ్లకు రూ.12 లక్షలు
ఆలయ పరిసరాల్లో తడికల పందిళ్ల ఏర్పాటుకు ఓ గుత్తేదారుకు రూ.12 లక్షలకు గుత్తపనులు అప్పగించడం పలు విమర్శలకు దారితీసింది. పందిళ్ల నిర్మాణంలో నాణ్యతలేని పాత తడికలు వినియోగించారని, అత్యధిక రేట్లకు గుత్తేదారుకు తడికల పందిళ్ల నిర్మాణం అప్పగించడంపట్ల కొందరు నాయకులు, మాజీ ధర్మకర్తలు దేవాదాయశాఖ కమిషనరు దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.
ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు..
వెంకటేశ్, ఆలయ ఈవో
ఆలయంలో వివిధ పనులకు సంబంధించిన పనులకు అంచనాలను ఇంజినీరింగ్ అధికారులు రూపొందిస్తారు. జయంత్యుత్సవాల సమయంలో వివిధ పనుల కోసం అధిక రేట్లతో బిల్లులు రూపొందించిన విషయమై ఇంజినీరింగు అధికారులే చూసుకోవాల్సి ఉంటుంది. కొండగట్టులో ఇంజినీరింగు అధికారి పనితీరు సరిగాలేదని, తమకు సహకరించడంలేదని ఇటీవలే దేవాదాయశాఖ కమిషనరుకు తెలియజేశాం. బిల్లుల మంజూరు విషయమై సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ