సింగరేణి ఎన్నికల నగారా మోగేనా!
సింగరేణి ఎన్నికలకు యాజమాన్యం కోర్టులో విన్నవించుకున్న గడువు పూర్తి కావొచ్చింది. మార్చిలో ఎన్నికలు నిర్వహించలేమని మరో మూడు నెలలు గడువు కావాలని సింగరేణి యాజమాన్యం కోర్టులో తమ వాదనను వినిపించింది.
న్యూస్టుడే, గోదావరిఖని
సింగరేణి ఎన్నికలకు యాజమాన్యం కోర్టులో విన్నవించుకున్న గడువు పూర్తి కావొచ్చింది. మార్చిలో ఎన్నికలు నిర్వహించలేమని మరో మూడు నెలలు గడువు కావాలని సింగరేణి యాజమాన్యం కోర్టులో తమ వాదనను వినిపించింది. సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ కోర్టులో వేసిన పిటీషన్పై న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర కార్మికశాఖ ఉప కమిషనర్ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించాలని యాజమాన్యంతోపాటు జిల్లాల పాలనాధికారులకు లేఖలు పంపించారు. కార్మిక సంఘాలు కూడా ఎన్నికలకు సంబంధించి తమ సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే యాజమాన్యం మాత్రం మార్చిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, మూడు నెలల సమయం కావాలని కోరింది. కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. జూన్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉత్పత్తికి పెద్దగా ప్రభావం పడదని, ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని యాజమాన్యం కోర్టులో తమ వాదనను వినిపించింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలు కూడా మూడు నెలలపాటు ఆగేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. ప్రస్తుతం యాజమాన్యం విన్నవించిన గడువు పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్ర కార్మికశాఖ ఉప కమిషనర్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
అధికార, ప్రతిపక్ష సంఘాలు సిద్ధం
ఎన్నికలకు ప్రస్తుత అధికార సంఘంతోపాటు ప్రతిపక్ష కార్మిక సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కార్మికుల సమస్యలపై యాజమాన్యం చర్చించేందుకు ముందుకు రావడం లేదని అధికారికంగా గుర్తింపు లేనప్పుడు ఎన్నికలు నిర్వహించాలని తాజాగా తెబొగకాసం నాయకులు వెల్లడించారు. గుర్తింపు సంఘంగా గౌరవం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించాలని తెబొగకాసం అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. ఇది వరకే ప్రతిపక్ష కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినా వారిని అధికారిక కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని సంఘాలను ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో జాతీయ కార్మిక సంఘాలతోపాటు ఇతర యూనియన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. సంఘాల వార్షిక నివేదికలు, నాయకత్వ పటిష్టత, కార్మికుల్లో పట్టు సాధించే దిశగా చర్యలు చేపట్టాయి.
గడువు ముగిసి నాలుగేళ్లు
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి నాలుగేళ్లవుతుంది. ఎన్నికల అనంతరం గెలిచిన తెబొగకాసం నాయకులకు రెండేళ్ల కాలపరిమితికి కార్మికశాఖ అధికారపత్రం అందజేసింది. దీనిపై గుర్తింపు సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు నాలుగేళ్ల కాలపరిమితికి అంగీకారం కుదిరిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించారు. గెలిచిన తర్వాత రెండేళ్లు ఏ విధంగా న్యాయమంటూ ప్రశ్నించిన తెబొగకాసం నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో వివాదం నడుస్తుండగానే కాలపరిమితి నాలుగేళ్లు గడిచిపోయింది. అయినా ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ ముందుకు రాలేదు. యాజమాన్యం సానుకూలత వ్యక్తం చేయలేదు.
* 2017 అక్టోబరు 5న సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెబొగకాసం గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. అధికారికంగా 2019 అక్టోబరుతో గడువు ముగియాలి. దీనిపై స్పష్టత లేకపోవడంతో నాలుగేళ్ల కాలపరిమితి(2021 అక్టోబరు)తో గడువు పూర్తి కావాలి. ఈ లెక్క ప్రకారం అయినా గడువు ముగిసి 19 నెలలు గడిచిపోయింది. ఎన్నికల నిర్వహణతో యాజమాన్యానికి కార్మిక సంఘాల మధ్య నెలకొంటున్న వివాదానికి తెరపడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!