జల వివాదాల పరిష్కారానికి కలిసి నడుద్దాం
రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలను పరిష్కరించేందుకు రాజకీయ వైషమ్యాలు మరచి పనిచేద్దామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. తాము విపక్షంలో ఉండగా జల వివాదాల అంశాల్లో అప్పటి అధికార పక్షానికి సహకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి పిలుపు
న్యాయనిపుణులతో మరోసారి చర్చిస్తా
సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బొమ్మై, మంత్రులు, అధికారులు
ఈనాడు డిజిటల్, బెంగళూరు: రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలను పరిష్కరించేందుకు రాజకీయ వైషమ్యాలు మరచి పనిచేద్దామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. తాము విపక్షంలో ఉండగా జల వివాదాల అంశాల్లో అప్పటి అధికార పక్షానికి సహకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శనివారం దీర్ఘకాలిక జల వివాదాల వ్యవహారాలపై తన అధికార నివాసంలో సమావేశమయ్యారు. కరోనా కారణంగా దిల్లీకి వెళ్లలేని తాను అక్కడి కర్ణాటక తరపు న్యాయవాదులు, అధికారులతో దృశ్యమాధ్యమంలోనే చర్చించారు. కావేరి, కృష్ణా, మహదాయి నదుల పరివాహకంలో మధ్య స్థాయిలో ఉండటం వల్ల దిగువన ఉన్న తమిళనాడు నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. దశాబ్దాలుగా ఈ వివాదాలపై విచారణ కొనసాగుతున్న కారణంగా అన్ని ప్రభుత్వాలు వీటిని పరిష్కరించలేకపోయాయి. పార్టీలన్నీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ వివాదాలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు.
ఫిబ్రవరి రెండో వారంలో అఖిల పక్ష సమావేశం
ఫిబ్రవరి 14న కావేరి జలాల వివాదం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆలోగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి బొమ్మై తెలిపారు. ఈ సమావేశంలో ఆయా పార్టీలు తమ అధికార హయాంలో చేపట్టిన చర్యలు, అభ్యంతరాలు, డీపీఆర్ వివరాలపై చర్చించి సహకరించాలన్నారు. కొన్ని వివాదాలు కీలకమైన ఘట్టంలో ఉన్నందున ప్రతిపక్షాలు వాటిపై ఆందోళనల ద్వారా తప్పుదోవ పట్టించే యత్నం చేయరాదని హితవు పలికారు. జనవరి చివరిలో తాను న్యాయ నిపుణులు, ఉభయ సభల నేతలు, జల, న్యాయశాఖల మంత్రులు, అధికారులతో మరో దఫా చర్చిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మరో ధర్మాసనానికి కృష్ణా వివాదం
కృష్ణా ఎగువ ప్రాజెక్టుపై రాష్ట్రం తరపున వాదించే న్యాయవాదులు తప్పుకోవటంతో మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని దిల్లీలోని కర్ణాటక న్యాయవాదులు ముఖ్యమంత్రికి సూచించారు. కృష్ణా ప్రాజెక్టుపై వచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ వాదిస్తున్న చంద్రచూడ్, ఎ.ఎస్.బోపణ్ణలు ఈ నెల 10న తప్పుకోవటంతో విచారణ ప్రక్రియ మందగించే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు. కొత్త ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు మనవి చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర వాదనలు సుప్రీంకోర్టుకు వినిపించే దిశగా అన్ని చర్యలు ఇకపై వేగంగా చేపడతామని హామీ ఇచ్చారు.
హొగనేక్కల్ ప్రాజెక్టును అడ్డుకుంటాం
కావేరి జల నిర్వహణ ధర్మాసనాలు, సుప్రీంకోర్టుకు కనీస సమాచారం ఇవ్వకుండా తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న హొగనేక్కల్ ప్రాజెక్టును అడ్డుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రూ.4,600 కోట్లతో హొగనేక్కల్ రెండో దశ, నదుల అనుసంధాన ప్రాజెక్టులకు అనుమతించరాదని తాము కేంద్ర జలశక్తి శాఖకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తానన్నారు. ఇప్పటికే సర్కారు పలు సవాళ్లను ఎదుర్కొంది. ఇకపై న్యాయ, రాజకీయ సంబంధ ఎత్తుగడలతో తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతి రాకుండా చేస్తామని సవాలు విసిరారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర న్యాయవాదులు మోహన్ కాతరికి, శ్యాం దివాన్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, కావేరి, కృష్ణ జలభాగ్య మండలి అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్