logo

పార్టీ మారేది లేదు: సుమలత

పార్టీ మారే విషయమై ఎలాంటి ఆలోచన చేయలేదని మండ్య లోక్‌సభ సభ్యురాలు సుమలత (స్వతంత్ర) స్పష్టం చేశారు. ఆమె మంగళవారం ఇక్కడ ఏర్పాటైన కేంద్ర పథకాల అమలుపై ప్రగతి పరిశీలనా సమావేశంలో పాల్గొన్నారు.

Published : 29 Jun 2022 03:49 IST


సుమలత

మండ్య, న్యూస్‌టుడే : పార్టీ మారే విషయమై ఎలాంటి ఆలోచన చేయలేదని మండ్య లోక్‌సభ సభ్యురాలు సుమలత (స్వతంత్ర) స్పష్టం చేశారు. ఆమె మంగళవారం ఇక్కడ ఏర్పాటైన కేంద్ర పథకాల అమలుపై ప్రగతి పరిశీలనా సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల తాను భాజపాలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. నిజానికి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తాను పార్టీ మారడంతో పాటు బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ టిక్కెట్‌ను కోరినట్లు కూడా వార్తలొచ్చాయన్నారు. తన తనయుడు అభిషేక్‌ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో జిల్లా పాలనాధికారి ఎన్‌.అశ్వతి, కార్యనిర్వహణాధికారి దివ్య ప్రభు, ఎస్పీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని