నరేగా కార్మికుల ఆకస్మిక మృతి
విజయనగర జిల్లాలో రెండు నెలల్లో ఐదుగురు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కార్మికులు పనిచేసే స్థలంలోనే తీవ్ర అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
రెండు నెలల్లో ఐదుగురు
మంగళవారం మృతిచెందిన కూడ్లిగి తాలూకా దిబ్బద హళ్లి నరేగా కార్మికుడు సిద్ధప్ప
హొసపేటె, న్యూస్టుడే: విజయనగర జిల్లాలో రెండు నెలల్లో ఐదుగురు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కార్మికులు పనిచేసే స్థలంలోనే తీవ్ర అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మృతిచెందిన నరేగా కార్మికులంతా కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. వారి మృతితో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తాజాగా మంగళవారం కూడ్లిగి తాలూకా ఎ.దిబ్బద హళ్లిలో నరేగా కార్మికులు పనిచేస్తూ గుండెనొప్పితో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పటి వరకు హగరిబొమ్మన హళ్లిలో నలుగురు, కూడ్లిగి తాలూకాలో ఒకరు నరేగా కార్మికులు మృతిచెందారు. హగరిబొమ్మన హళ్లిలో మే నెలలో ముగ్గురు కార్మికులు 15 రోజుల్లోనూ మృతిచెందడంతో జిల్లా పంచాయతీ నరేగా కార్మికులకు వైద్యపరీక్షలు చేయించేందుకు ముందుకు వచ్చింది. హగరిబొమ్మన హళ్లిలో ఒక్కసారి మాత్రం వైద్యపరీక్ష శిబిరాలు జరిగాయి. అన్ని తాలూకాల్లోని నరేగా కార్మికులకు వైద్యపరీక్ష శిబిరాలు చేయించాలన్న డిమాండు అలాగే మిగిలిపోయింది. హగరిబొమ్మన హళ్లిలో మొత్తం నలుగురు మృతిచెందగా ఇద్దరి కుటుంబాలకు పరిహారం అందింది. మరో ఇద్దరికి పరిహారం రావాల్సి ఉంది. తాజాగా కూడ్లిగి తాలూకా ఎ.దిబ్బద హళ్లి కార్మికుడు సిద్ధప్ప (62) మృతిచెందారు. ఇప్పటి వరకు మృతిచెందిన ఐదుగురు గుండెపోటుతోనే కన్నుమూశారు. హరిహర, భద్రావతి నుంచి గుండెవ్యాధి నిపుణులను పిలిపించి నరేగా కార్మికులకు పరీక్షలు చేయిస్తామని జడ్పీ అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. జిల్లాలోని పశ్చిమ తాలూకాలైన హగరిబొమ్మన హళ్లి, కూడ్లిగి, కొట్టూరు, హడగలి, హరపన హళ్లిలో చాలా మెట్ట భూములు ఉన్నాయి. వర్షాలు కురిస్తేనే పంటలు. ఈ నేపథ్యంలో ఈ తాలూకాల ప్రజలు కుటుంబ నిర్వహణ కోసం నరేగా పనులకు వెళ్తున్నారు. రోజుకు మహిళ, పురుషులకు సమానంగా రూ.309 కూలి లభించడంతో 60 ఏళ్లు నిండినవారు కూడా పనులకు వెళ్తూ అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో సుమారు 80వేల మంది నరేగా కార్మికులు రోజూ పనిచేస్తున్నారు. మే, జూన్ నెలల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండటంతో నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. జూన్లో ఎండలు కొంత తగ్గినా కూడ్లిగి తాలూకాలో కార్మికుడు మృతిచెందడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. తప్పనిసరిగా వైద్యపరీక్షలకు ఈ తక్షణమే ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్