రైలు నిలయాలకు.. ఆధునిక హంగులు
రాష్ట్రంలో 55 రైల్వేస్టేషన్లను సర్ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయడంతో అధికారులు మునిగిపోయారు.
రాష్ట్రంలో 55 రైల్వేస్టేషన్ల అభివృద్ధి
సర్ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్ తరహాలో పలు స్టేషన్లు రానున్నాయి
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే: రాష్ట్రంలో 55 రైల్వేస్టేషన్లను సర్ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయడంతో అధికారులు మునిగిపోయారు. కేంద్రబడ్జెట్లో రాష్ట్రంలోని రైలు పథకాలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.7,561కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 2009-2013తో పోలిస్తే నిధులు కేటాయింపులో తొమ్మిదివందల శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రూ.49,336 కోట్లు వ్యయంతో 4,330 కిలోమీటర్ల రైల్వే పనులు సాగుతున్నాయి. అందులో గేజ్ మార్పు, కొత్త మార్గాలు నిర్మాణం, 11 ద్విపథ మార్గాలు చేరి ఉన్నాయి. నైరుతి రైల్వే విభాగంలో రూ.9,200కోట్లు ప్రతిపాదించగా రూ.527కోట్లు బడ్జెట్లో కేటాయించారు. మైసూరు నవలూరు రైల్వేషెడ్ నిర్మాణానికి రూ.వేయి కోట్లు, యశ్వంతపుర- చిక్కబాణావర విద్యుద్దీకరణ, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్- వైట్ఫీల్డ్ రైల్వేస్టేషన్ వరకు ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పని చేసే సిగ్నల్ వ్యవస్థ చేపడతారు.
* కోట్టూరు- హరిహర 65 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించారు. కడూరు- చిక్కమగళూరు- సకలేశపుర 92 కిలోమీటర్లకు రూ.145కోట్లు, హసన్-బెంగళూరు 166 కి.మీ రూ.33 కోట్లు, హొబ్బళ్లి- అంకోలా 167 కి.మీ రూ.12 కోట్లు, రాయదుర్గం- తుమకూరు 213 కి.మీ రూ.350 కోట్లు, బాగల్కోట్- కుడచి 142 కి.మీ రూ.360 కోట్లు, తుమకూరు- దావణగెరె 199 కి.మీ రూ.420 కోట్లు, వైట్ఫీల్డ్- కోలారు 52 కి.మీ రూ.10 కోట్లు, మారికుప్పం- కుప్పం 23 కి.మీ రూ.200కోట్లు, గదగ- వాడి 252కి.మీ రూ.350కోట్లు, శివమొగ్గ- శికారిపుర- రాణిబెన్నూరు 103కి.మీ రూ.150కోట్లు, హసన్-బేలూరు 32కి.మీ రూ.60కోట్లు, బెళగావి- ధార్వాడ్ 73కి.మీ రూ.10కోట్లు కేటాయించారు.
* ద్విపథ రైలు మార్గాల నిర్మాణానికి బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్- కె.ఆర్.పురం 23కి.మీ రూ.250కోట్లు, హొసపేట- వాస్కో 352కి.మీ రూ.400కోట్లు, గదగ- హొట్టి 284కి.మీ రూ.170కోట్లు, హొబ్బళ్లి- చిక్కజుజూరు 190కి.మీ రూ.150కోట్లు, యశ్వంతపుర- చిన్నసంద్ర 21కి.మీ రూ.85కోట్లు, ధర్మవరం- పెనుకొండ 41కి.మీ రూ.120కోట్లు, బయ్యప్పనహళ్లి- హోసూరు 48కిలోమీటర్ల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించినట్లు అధికారులు వివరించారు.
నానాటికీ పెరుగుతున్న రైల్వే ప్రయాణికులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!