Love-Murder: యువకుడిని కడతేర్చిన ప్రేమ
ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారు. తన ప్రేమకు అడ్డు రావద్దని హెచ్చరించినా చేతన్ అనే యువకుడు వెనక్కు తగ్గకపోవడంతో ఆమెను ప్రేమించిన మరో యువకుడు సతీశ్ తన సహచరులతో కలిసి దాడికి తెగబడ్డాడు.
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారు. తన ప్రేమకు అడ్డు రావద్దని హెచ్చరించినా చేతన్ అనే యువకుడు వెనక్కు తగ్గకపోవడంతో ఆమెను ప్రేమించిన మరో యువకుడు సతీశ్ తన సహచరులతో కలిసి దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో కోలారు జిల్లా మాలూరు సమీపంలోని అయ్యప్పనగరకు చెందిన చేతన్ మరణించాడు. హత్య చేసిన సతీశ్- అతని అనుచరులు శశి, శోభను సర్జాపుర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలింపు తీవ్రం చేశారు. చేతన్కు గత అక్టోబరు 26న మద్యం తాగించిన సతీశ్, దక్షిణ పినాకిని కాలువ వద్దకు తీసుకువెళ్లి తన సహచరులతో కలిసి చేతన్ను హత్య చేసి పరారయ్యారు. దర్యాప్తులో ఈ విషయం తేలిందని పోలీసులు శనివారం వెల్లడించారు. ఈక్రమంలోనే నిందితులను అరెస్టు చేశారు. అత్తిబెలె ఠాణా పరిధిలో గతంలో జరిగిన హత్య కేసులో శోభ కారాగారంలో శిక్ష అనుభవించి జామీనుపై బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు.
విద్యార్థినిపై మాజీ ప్రియుని దాడి
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న ద్వితీయ బీకాం విద్యార్థినిపై ఆమె మాజీ ప్రియుడు నరేశ్ దాడి చేశాడు. స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైన ఘటన కెంగేరి పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నరేశ్ మైసూరు రోడ్డు వండర్లాలో ఉద్యోగి. ఏడాదిన్నర పాటు ఆ యువతితో ప్రేమ కొనసాగించాడు. అభిప్రాయ భేదాలు రావడంతో నరేశ్కు ఆ విద్యార్థిని దూరమైంది. పదేపదే ఫోన్లు చేయడం, సందేశాలు పంపించడంతో అతని నంబరును ఆమె బ్లాక్ చేసింది. దీంతో అతను దారి కాచి ఆమెపై దాడి చేశాడు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పరారీలో ఉన్న నిందితుని కోసం కెంగేరి ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరవు గాయానికి మందు!
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్రాల మధ్య కరవు పరిహారం కోసం కొనసాగుతున్న పోరు కొలిక్కి వచ్చింది. గత శుక్రవారం కేంద్ర సర్కారు వారం రోజుల్లో ఈ పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తూ విచారణ వాయిదా చేయాలని కోరిన విషయం తెలిసిందే. -
ఇక..ఉత్తర దిగ్విజయయాత్ర!
[ 28-04-2024]
కర్ణాటక దక్షిణ, పాతమైసూరు, కరావళి ప్రాంతాల్లో తొలివిడత ఎన్నికలను విజయవంతంగా ముగించిన పార్టీలు.. రెండో విడతపై దృష్టి సారించాయి. -
హాసనలో లైంగిక దౌర్జన్యాలపై సిట్
[ 28-04-2024]
హాసన జిల్లాలో ఓ పార్టీకి చెందిన యువ నాయకుడు యువతులు, మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. -
భాజపా తీరు ప్రమాదకరం
[ 28-04-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నాయకులతో వెనుకబడిన వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. -
తప్పుడు ప్రచారంలో ఆరితేరారు
[ 28-04-2024]
అబద్ధాలను చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరితేరారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. చెప్పిన అబద్ధాన్ని మరోసారి చెప్పకుండా, కొత్తవి నమ్మించేలా చెప్పడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. -
కారటగిలో రెండు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
[ 28-04-2024]
ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు ఆకర్షించేందుకు కారటగి పట్టణంలోని రెండు పోలింగ్ కేంద్రాలను అధికారులు మాదిరి పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. -
కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం
[ 28-04-2024]
పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, కూలీలు, విద్యార్థులకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ కోరారు. -
అమాత్యులకు పరువు.. ఆయనకు రాజకీయ మలుపు
[ 28-04-2024]
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాం గెలుపును బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, జమీర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. -
ప్రధాని ముఖంలో ఓటమి భయం
[ 28-04-2024]
అబద్ధాల సర్దార్..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప తెలిపారు. -
కాంగ్రెస్ వారు చెంబు లీజ్కు తీసుకున్నారా?
[ 28-04-2024]
బళ్లారి నగరంలో జరిగిన బహిరంగ సమావేశంలో రాహుల్గాంధీ హస్తం గుర్తు గురించి మాట్లాడలేదు. ఖాళీ చెంబు గురించే మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన కోహ్లీ, జాక్స్.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!