ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు.
నిప్పులు చెరిగిన సిద్ధరామయ్య
సభా వేదికపై ప్రసంగిస్తున్న సిద్ధరామయ్య
రామనగర, న్యూస్టుడే : బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. వైట్కాలర్ అభ్యర్థి డాక్టర్ మంజునాథ్ కావాలో- సురేశ్ కావాలో ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. రామనగరలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడి నుంచి సురేశ్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరోసారి ఆయనకే పార్టీ టికెట్ కేటాయించిందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ముందంజలో ఉంటే.. కమలనాథులు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతారని ఆరోపించారు. ఐదు గ్యారంటీ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం చేరువయ్యిందన్నారు. భాజపాకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. కర్ణాటకలో భాజపా అధికారంలో ఉన్నప్పుడు పన్నుల రూపంలో చెల్లించిన మొతాన్ని అభివృద్ధి పనులకు ఉపయోగించలేదన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామనగర అభివృద్ధిని పక్కన పెట్టారని ఆరోపించారు.
భాజపా, దళ్ నేతలు చేస్తున్న ఆరోపణలను విశ్వసించేందుకు ప్రజలు పిచ్చివాళ్లు కాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. కావేరి నీటిని కాపాడుకునేందుకు, మేకెదాటు ప్రాజెక్టుకు చేసిన పోరాటానికి జనతాదళ్ మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు భాజపాతో చేరి, కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే లక్ష్యంగా దళపతులు పని చేస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ అభ్యర్థి డీకే సురేశ్, మంత్రులు ఎంసీ సుధాకర్, మంకాళ వైద్య, ఎమ్మెల్సీ సుదామ దాస్, జాతీయ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?