గత వైభవమా.. వరుస విజయమా!
కొప్పళ లోక్సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. గడిచిన మూడు ఎన్నికల్లో భాజపా బాట పట్టింది. 2004 తరువాత కాంగ్రెస్కు కొరకురానికొయ్యలా తయారైంది.
నాడు కాంగ్రెస్ కంచుకోట..నేడు భాజపాకు బాసట
కొప్పళలో ఎవరిదో పైచేయి?
గంగావతి,న్యూస్టుడే: కొప్పళ లోక్సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. గడిచిన మూడు ఎన్నికల్లో భాజపా బాట పట్టింది. 2004 తరువాత కాంగ్రెస్కు కొరకురానికొయ్యలా తయారైంది. 2009, 2014, 2019లో భాజపా హ్యాట్రిక్ కొట్టింది. నాలుగోసారి సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. గత వైభవాన్ని తిరిగి పొందాలని కాంగ్రెస్ పోరాడుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ సంగణ్ణను కాదని కొత్తముఖం యువ వైద్యుడు కె.బసవరాజ్ను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఓడిన రాజశేఖర్ హిట్నాళకు కాంగ్రెస్ మరో అవకాశం ఇచ్చింది. మూడు ఎన్నికల్లో భాజపా వీరశైవ పంచమసాలి వర్గం అభ్యర్థులనే ఎంపిక చేసి సఫలమైంది. ప్రస్తుతం అదే సంప్రదాయం కొనసాగించింది. కాంగ్రెస్ వెనుకబడ్డ వర్గాల వైపే మొగ్గు చూపింది.
కొప్పళ బసవేశ్వర కూడలి
మూడు జిల్లాల నియోజకవర్గం: 2004 నియోజవర్గాల పునర్విభజన ప్రకారం ఈ లోక్సభ స్థానం కొప్పళ, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో విస్తరించింది. కొప్పళ, యలబుర్గా, కనకగిరి, కుష్ఠగి, గంగావతి, సింధనూరు. మస్కి, సిరుగుప్ప శాసనసభ నియోజకవర్గాలు ఈ స్థానం పరిధిలోకి వస్తాయి. మొత్తం 18,51,700 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలే అధికం. పురషులు 912818 మంది, మహిళలు 939750 మంది, ఇతరులు 132 మంది ఉన్నారు. 2,045 పోలింగ్ కేంద్రాలున్నాయి.
విశేషాలు: 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా కొప్పళ ఓటర్లు స్వతంత్ర అభ్యర్థి శివమూర్తిస్వామి అళవండిని గెలిపించారు. 1991లో జనతా పరివార్ ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇక్కడ బరిలోకి దించింది. ఆయన ఓటమి చవిచూశారు. అప్పట్లో లోక్సభకు ఎన్నికై ఉంటే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడిని కాదంటూ సిద్ధరామయ్య కొప్పళకు వచ్చిన ప్రతిసారి చమత్కరిస్తుంటారు. 1989లో ఇక్కడి నుంచి గెలిచిన బసవరాజ్ పాటిల్ అన్వరీ చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రిగా సేవలు అందించారు. అప్పట్లో దక్షిణ భారతం నుంచి కేంద్ర మంత్రి మండలిలో ఆయనొక్కరికే స్థానం దక్కడం విశేషం.
బలాబలాలు
కొప్పళ లోక్సభ పరిధిలోని 8 శాసనసభ నియోజకవర్గాల్లో గత శాసనసభ ఎన్నికల్లో ఆరుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. యలబుర్గా, కొప్పళ, కనకగిరి, సింధనూరు, మస్కి, సిరుగుప్పాల్లో కాంగ్రెస్ శాసనసభ్యులున్నారు. కుష్ఠగిలో భాజపా నెగ్గింది. గంగావతిలో కేఆర్పీపీ నుంచి శాసనసభకు ఎన్నికైన గాలి జనార్దన్రెడ్డి ఇటీవల భాజపాలో చేరడం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎవరి ప్రభావం ఎంత అనేది ఓటర్లే తేల్చాలి. సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు, కార్యకర్తల బలగం ఎక్కువే. భాజపా మాత్రం తన పూర్వ వైభవం పైనే ఆధారపడింది. తాజా కేఆర్పీపీ విలీనంతో ఎంతమేరకు సఫలీకృతమవుతుందో వేచిచూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
[ 29-04-2024]
హాసన సెక్స్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు- ఎంపీ ప్రజ్వల్పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ (47).. భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త కుమార్తె. -
ఉత్తరాన మోదీ ఉరుములు
[ 29-04-2024]
రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం భాజపా ప్రచారం వాయువేగంతో ప్రారంభించింది. ఒకే రోజున నాలుగు ప్రాంతాలు, తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థుల విజయం కోసం భాజపా కీలకనేత- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారాన్ని ఉరకలెత్తించారు. -
చైతన్యమే జయకేతనం
[ 29-04-2024]
ఉద్యాననగరి బెంగళూరువాసులు చైతన్యవంతంగా అడుగు ముందుకేశారు. -
అడిగింది కొండంత... ఇచ్చింది గోరంత
[ 29-04-2024]
కన్నడనాడుకు రూ.18 వేల కోట్ల కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కోరితే కేంద్రం రూ.3,454 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. -
చెలరేగిన నిరసన ప్రజ్వాల
[ 29-04-2024]
లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన లోక్సభ సభ్యుడు, జనతాదళ్ యువ నాయకుడు ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్ సమితి డిమాండు చేసింది. -
బెళగావిలో నేనే అభ్యర్థిని!
[ 29-04-2024]
బెళగావి లోక్సభ ఎన్నికల్లోనే తానే అభ్యర్థిని అని భావించి ఓటర్లు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. -
చందనసీమలో నమోజపం!
[ 29-04-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొని భాజపా అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు. -
ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తిరిగిస్తా
[ 29-04-2024]
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తప్పకుండా తిరిగి ఇస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. -
అబద్ధాలను విశ్వసించవద్దు : సిద్ధు
[ 29-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి యజమానురాలి ఖాతాకు ఏటా రూ.ఒక లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్