క్రీడా ప్రాంగణం.. ఔత్సాహికులకు ప్రోత్సాహం
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో గ్రామానికో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థల సేకరణ చేపట్టాలని అధికార
జిల్లాలో 1,280 గ్రామాల్లో ఏర్పాట్లు
530 చోట్ల స్థలాల గుర్తింపు
ఇల్లెందు పట్టణం, న్యూస్టుడే
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో గ్రామానికో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థల సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఉపాధి హామీ నిధులతో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం(టీకేపీ) పేరిట ప్రాంగణాలు నిర్మించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి స్థల సేకరణ పూర్తి చేసి క్రీడా ప్రాంగణాల పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో 1,280 గ్రామాల్లో 1,280 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 530 గ్రామాల్లో స్థలాలు సేకరించారు. మరో రెండు రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా క్రీడా ప్రాంగణ స్థల సేకరణ పూర్తి చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఒక్కో క్రీడా ప్రాంగణం ఎకరం విస్తీర్ణం తగ్గకుండా నిర్మించనున్నారు. ఈ క్రీడా ప్రాంగణంలో కోకో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్జంప్ పిట్, ఎక్సర్సైజ్ బార్ సింగిల్ అండ్ డబుల్ ఉండే విధంగా రూపకల్పన చేశారు. జంగిల్ కటింగ్, మొట్లు తొలగింపు, భూమి చదును, గ్రావెల్ తోలకం, వాటర్ స్ప్రే చేయించనున్నారు. ఒక్కో క్రీడా ప్రాంగణం రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు.
* క్రీడా ప్రాంగణం చుట్టూ ఒక్క వరుసలో 300 మొక్కలు నాటనున్నారు. స్థానిక గ్రామపంచాయతీ నర్సరీల్లో లభించే గుల్మోర్, వేప, కానుగ, బాదం, తంగేడు, చింత వంటి మొక్కలను 0.75 మీటర్ల నుంచి 1 మీటరు దూరంలో నాటాలని నిర్ణయించారు.
పలుచోట్ల పనులు ప్రారంభం
మధుసూదన్రాజు, డీఆర్డీఓ
క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు గ్రామాల్లో స్థల సేకరణ వేగంగా జరుగుతుంది. స్థలాలు గుర్తించిన దగ్గర పనులు కూడా ప్రారంభించాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలు ప్రారంభించనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ గళం.. ప్రచార దళం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు సవాల్గా మారాయి. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూనే ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. -
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
[ 28-04-2024]
రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. -
కనుమరుగైన హెలికాప్టర్ నియోజకవర్గం
[ 28-04-2024]
భద్రాచలం లోక్సభ స్థానానికి హెలికాప్టర్ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. -
21 మంది ధరావతు కోల్పోయారు..!
[ 28-04-2024]
2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన: మంత్రులు
[ 28-04-2024]
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కానిస్టేబుల్ను సత్కరించిన డీజీపీ
[ 28-04-2024]
దమ్మపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగముత్యాన్ని డీజీపీ రవిగుప్తా శనివారం సత్కరించారు. ఈ ఏడాది మేడారం మహాజాతరలో విధులు నిర్వహించిన సమయంలో నాగముత్యం గుండెపోటుకు గురైన ముగ్గురు వ్యక్తులకు సీపీఆర్ నిర్వహించి కాపాడారు. -
రూ.63 లక్షల నగదు సీజ్
[ 28-04-2024]
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కేసీఆర్ కష్టంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: భారాస
[ 28-04-2024]
సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వర్తించాలి
[ 28-04-2024]
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్సభ స్థానం సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే అన్నారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 28-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..