వామ్మో వైరల్ జ్వరాలు
వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 వరకు చలి తీవ్రత కొనసాగుతోంది.
జలుబు, దగ్గుతో సతమతం
వాతావరణ మార్పులే కారణమంటున్న వైద్యులు
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే
వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చల్లని వాతావరణానికి పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఇటీవల పెరిగిన రోగుల సంఖ్య కూడా పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు పిల్లలు ఆయా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రస్తుత తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో చల్లని వాతావరణానికి ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జ్వరాలు, తలనొప్పి, గొంతునొప్పి బారిన పడుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న బాధితులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళ చలిగాలిలో ప్రయాణించడం, ఉదయాన్నే నిద్రలేచి విద్యార్థులు చల్లని వాతావరణంలో ప్రత్యేక తరగతులకు హాజరు కావడం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. చలి తీవ్రతను, కాలుష్యాన్ని దరిచేరకుండా మాస్క్లు, వెచ్చని దుస్తులు ధరించకపోవడం కూడా సమస్యలకు కారణమవుతోంది.
* కొద్దిరోజుల నుంచి జిల్లా ఆస్పత్రి ఓపీ విభాగానికి వచ్చే రోగుల సంఖ్య సాధారణ రోజుల కన్నా 10 నుంచి 20 శాతం వరకు పెరిగింది. అందులో 70 శాతం మంది జలుబు, జ్వరం బాధితులే. చలి పెరిగిన తర్వాతే పలు సమస్యలతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. చికిత్స తీసుకుంటున్నా ఆయా సమస్యలతో కనీసం వారంపాటు ఇబ్బంది పడుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలు, వసతి గృహాల్లో నివాసముంటున్న విద్యార్థులు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. ఫలితంగా 10 శాతం మంది గైర్హాజరవుతున్నారని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు.
పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: డాక్టర్ శిల్ప, పిల్లల వైద్య నిపుణురాలు
చలికాలం తగ్గే వరకు తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆస్తమా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్యం కుదుటపడే వరకు ఇంటికే పరిమితం కావాలి. సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు పంపించవద్దు. పాఠశాలలకు వెళ్లే సమయంలో మాస్క్లు, వెచ్చదనాన్ని అందించే దుస్తులు వేయాలి. వీలైనంత వరకు చలిగాలులకు దూరంగా ఉంచాలి.
వైరల్ ఇన్ఫెక్షన్ల విస్తృతి: డాక్టర్ సురేందర్, ప్రభుత్వాసుపత్రి వైద్యులు
చలి గాలులే అనారోగ్య సమస్యలకు కారణం. వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం సమస్యలతో బాధపడుతున్న వారే ఆస్పత్రులకు అధికంగా వస్తున్నారు. బాధితులు కనీసం రెండు వారాల పాటు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కొవిడ్ కాకపోయినా ప్రస్తుత సీజన్లో వచ్చే సమస్యలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. మాస్క్ ధరించడం, శుభ్రత పాటించడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు, ఆహారం తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM