logo

ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వ్యక్తి మృతి

పండుగ పూట విషాదం నెలకొంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

Published : 18 Apr 2024 05:45 IST

మారేశ్వరరావు

సత్తుపల్లి, న్యూస్‌టుడే: పండుగ పూట విషాదం నెలకొంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తుపల్లిలోని జవహర్‌నగర్‌కు చెందిన గుంజా మారేశ్వరరావు(35) మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ ప్రాంతానికి సమీపంలోని దామెరచెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. అతని కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా బుధవారం ఉదయం సదరు చెరువు కట్టపై వాకింగ్‌ చేస్తున్న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించడంలో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోని శవాగారానికి తరలించి శవ పంచనామా చేశారు. మృతుని సోదరుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య చిన్నమంగ, కుమారులు రోహిత్‌, శివ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని