logo

కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు

ఖమ్మం నగరంలోని 38, 56వ డివిజన్ల భారాస కార్పొరేటర్లు ఆలియా, పైడిపల్లి రోహిణి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్‌లో సోమవారం చేరారు.

Published : 30 Apr 2024 04:55 IST

మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు

ఖమ్మం కమాన్‌బజార్‌: ఖమ్మం నగరంలోని 38, 56వ డివిజన్ల భారాస కార్పొరేటర్లు ఆలియా, పైడిపల్లి రోహిణి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్‌లో సోమవారం చేరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ వారికి పార్టీ కండువాలు కప్పారు. పార్టీ నగర అధ్యక్షుడు ఎండీ జావేద్‌,  నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వరరావు, మిక్కిలినేని నరేందర్‌, కమర్తపు మురళీ, సాధు రమేశ్‌రెడ్డి, షౌకత్‌ అలీ, పైడిపల్లి సత్యనారాయణ, పాలెపు వెంకటరమణ పాల్గొన్నారు. అంతకుముందు తుమ్మల క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరికలపై కార్యకర్త సైదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాల్వంచ కృష్ణను పార్టీలో చేర్చుకోవద్దని ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని హంగామా సృష్టించారు. ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమని అక్కడున్న నాయకులు సర్దిచెప్పారు. అనంతరం చేరికల ప్రక్రియను పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని